2020.. తెవాతియా అయిపోతే ఎంత బాగుండు!
2020.. జనవరి 1న అందరూ సంతోషంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకున్నారు. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో ఏడాదిని ఆరంభించారు. రెండు నెలలు గడిచిందో లేదో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనా ఆవిర్భవించి సమస్త భూమండలం వ్యాపించింది. భారత్లోనూ ప్రవేశించింది...
వైరల్గా మారిన రాజస్థాన్ ట్విటర్ హెడ్లైన్
(Twitter/RahulTewatia: నితీశ్ రాణాతో తెవాతియా)
2020.. జనవరి 1న అందరూ సంతోషంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకొన్నారు. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో ఏడాదిని ఆరంభించారు. రెండు నెలలు గడిచిందో లేదో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనాలో ఆవిర్భవించి సమస్త భూమండలం వ్యాపించింది. భారత్లోనూ ప్రవేశించింది. ఊహించని వేగంతో చాలామందిని కాటేసింది.
లాక్డౌన్లు.. ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం పెరిగిపోయాయి. సాటి మనిషిని ఆప్యాయతతో హత్తుకొనేవారే కరవయ్యారు. ఎడం పెరిగింది. మాస్క్లు ముఖాలకు ఆభరణాలుగా మారాయి. ఇంకా ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా వరదలు.. వానలు.. తుపాన్లు.. కార్చిచ్చులు.. విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయి.
ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది! కాలచక్రం అనూహ్యంగా మలుపులు తిరిగితే బాగుంటుందేమో అనిపిస్తోంది. మహమ్మారి కరోనా అంతమై హఠాత్తుగా ప్రశాంతత నెలకొంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు తన ట్విటర్లో పెట్టిన ఓ వ్యాఖ్య అందరినీ ఆకట్టుకుంటోంది. ‘2020 రాహుల్ తెవాతియాగా మారాలని ఆశిస్తున్నాం’ అన్న మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ మారాయి. ఎందుకంటే...
పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆటగాడు రాహుల్ తెవాతియా అప్పటి వరకు అందరినీ విసిగించాడు. సింగిల్స్ తీసేందుకూ కష్టపడ్డాడు. ఆడిన తొలి 19 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టాడు. ‘ఉతప్ప కాకుండా ఇతనెందుకు వచ్చాడ్రా బాబూ..!’ అనిపించాడు. కానీ హఠాత్తుగా గేర్లు మార్చి చివరి 12 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 45 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది ఔరా! అనిపించాడు. ఈ 2020 సంవత్సరం సైతం ఇప్పటి వరకు అందరినీ విసిగించింది. ఉన్నట్టుండి హాయిగా మారితే ఎంత బాగుంటుందో అనే అర్థంలో రాజస్థాన్ వ్యాఖ్య ఉండటంతో అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి