Siraj: వన్డే ప్రపంచకప్లో సిరాజ్ ఆడతాడని ఆశిస్తున్నా: సిరాజ్ తల్లి
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో సిరాజ్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ సిరాజ్ గొప్పగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్లో ఆడతాడని ఆశిస్తున్నట్టు అతడి తల్లి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: సొంత గడ్డపై తన కుమారుడి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన సిరాజ్ తల్లి అతడు వన్డే ప్రపంచకప్లో ఆడాలని కోరుకున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్ అతడికి ఎంతో ప్రత్యేకమైంది. సొంతమైదానంలో సూపర్ బౌలింగ్తో కివీస్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా సిరాజ్ కుటుంబసభ్యులు మాట్లాడిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. ‘‘దేశం గర్వించేలా నా కుమారుడు ఎదుగుతాడని ఆశిస్తున్నా. సిరాజ్ తన అద్బుతమైన ప్రదర్శనలతో ఆటలో ముందుకు సాగాలి. వన్డే ప్రపంచకప్లో సిరాజ్ ఆడతాడని ఆశిస్తున్నా’’ అని సిరాజ్ తల్లి తెలిపారు.
ఉప్పల్ మైదానంలో సిరాజ్ 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ స్వస్థలంలో ఆడటం తనకెంతో ధైర్యాన్ని ఇస్తుందని తెలిపాడు.‘‘సొంత గడ్డపై ఇదే నా మొదటి అంతర్జాతీయ మ్యాచ్. ఇదివరకు ఇక్కడ ఐపీఎల్ మాత్రమే ఆడాను. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ మ్యాచ్ చూడటానికి వస్తారు. అందువల్ల స్వస్థలంలో ఆడుతుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది’’ అని సిరాజ్ తెలిపాడు.జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో జట్టులో సిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే జనవరి 21న రాయ్పుర్లో జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.