Virat Kohli : వందో టెస్టులో కోహ్లీ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాలి : సునీల్ గావస్కర్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో ఆడనున్న వందో టెస్టులో సెంచరీ బాదాలని కోరుకుంటున్నానని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ఇప్పటి వరకు చాలా మంది వందకి పైగా..
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో ఆడనున్న వందో టెస్టులో సెంచరీ బాదాలని కోరుకుంటున్నానని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ఇప్పటి వరకు చాలా మంది వందకి పైగా టెస్టు మ్యాచులు ఆడారని.. వారిలో చాలా కొద్ది మంది మాత్రమే వందో టెస్టులో శతకం నమోదు చేశారని పేర్కొన్నాడు. పంజాబ్లోని మొహాలీ వేదికగా.. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు మ్యాచే కోహ్లీ ఆడనున్న వందో టెస్టు కావడం గమనార్హం.
‘ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు వందకి పైగా టెస్టు మ్యాచులు ఆడారు. కానీ, వారిలో చాలా కొద్ది మంది మాత్రమే వందో టెస్టులో సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున ఒక్కరు కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. అందుకే, వందో టెస్టు ఆడనున్న విరాట్ కోహ్లీ శతకం నమోదు చేసి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను. అతడు ఒక్క టెస్టు క్రికెట్లోనే కాదు.. మిగతా ఫార్మాట్లలో కూడా ఎన్నో గొప్ప ఘనతలు సాధించాడు. దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు’ అని సునీల్ గావస్కర్ చెప్పాడు.
భారత్ తరఫున ఇప్పటి వరకు కేవలం 10 మంది ఆటగాళ్లు మాత్రమే వందకు పైగా టెస్టు మ్యాచులు ఆడారు. సచిన్ తెందూల్కర్ (200), రాహుల్ ద్రవిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గావస్కర్ (125), దిలిప్ వెంగ్సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), ఇశాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), వీరేంద్ర సెహ్వాగ్ (103) టెస్టు మ్యాచులు ఆడారు. శ్రీలంకతో జరుగనున్న తొలి టెస్టు మ్యాచులో కోహ్లీ ఆడటం ద్వారా వంద టెస్టులు ఆడిన 12వ ఆటగాడిగా నిలువనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.