బాబోయ్.. టీమిండియా పరిస్థితేంటి?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రత్యర్థి జట్టు కంటే గాయాలతోనే తీవ్ర పోరాటం చేస్తోంది. ఇది కాస్త అతియోశక్తి అనిపించినా, కాదనలేని వాస్తవం! ఒకరా, ఇద్దరా.. జట్టు ఎంపిక నుంచి ఇప్పటివరకు 13 ...
ఇన్ని గాయాలా.. ఆఖరి టెస్టుకు ఎవరున్నారు?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రత్యర్థి జట్టు కంటే గాయాలతోనే తీవ్ర పోరాటం చేస్తోంది. ఇది కాస్త అతియోశక్తి అనిపించినా, కాదనలేని వాస్తవం! ఒకరా, ఇద్దరా.. జట్టు ఎంపిక నుంచి ఇప్పటివరకు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయినా కంగారూలకు భారత్ ముచ్చెమటలు పట్టించడం అభినందనీయం.
అయితే బ్రిస్బేన్ వేదికగా జరిగే ఆఖరి టెస్టుకు గాయంతో బుమ్రా కూడా దూరమవుతున్నాడని ప్రకటించడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. తుదిజట్టును ఎలా ఎంపికచేయాలో తెలియక జట్టు యాజమాన్యం తల పట్టుకుంటోంది. రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. కానీ సీనియర్లు లేని లోటుని జూనియర్లు భర్తీ చేయగలరా అనేది ప్రశ్న. అంతేగాక గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఎలా పోరాడుతుందనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో గాయపడిన ఆటగాళ్లు, రిజర్వ్ బెంచ్ ప్లేయర్ల వివరాలు చూద్దాం.
భువేనేశ్వర్ కుమార్
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పిక్క కండరాల గాయంతో ఆస్ట్రేలియా పర్యటన ఎంపికకు అందుబాటులో లేడు. ఐపీఎల్ 13వ సీజన్లో భువీ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు కోలుకోవడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) చేరాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి కోలుకున్న అతడు ముస్తాక్ అలీ టోర్నీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్నాడు.
ఇషాంత్ శర్మ
సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పక్కటెముకల గాయంతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అయితే చివరి రెండు టెస్టులకు అయినా ఇషాంత్ అందుబాటులో ఉంటాడనుకున్నారు. కానీ ఆలస్యంగా కోలుకోవడం, ఆస్ట్రేలియా కఠిన క్వారంటైన్ నిబంధనలతో అతడు కంగారుల గడ్డకు పయనమవ్వలేదు.
వరుణ్ చక్రవర్తి
ఐపీఎల్లో సత్తాచాటిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ భుజం గాయంతో అతడు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
రోహిత్ శర్మ
తొడకండరాల గాయంతో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపికవ్వలేదు. అయితే టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
మహ్మద్ షమి
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా షమి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు చివరి మూడు టెస్టులకు దూరమై స్వదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కు కూడా అందుబాటులో ఉండటం అనుమానమే!
ఉమేశ్ యాదవ్
సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ రెండో టెస్టులో గాయపడ్డాడు. కాలి పిక్క పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలియడంతో స్వదేశానికి పయనమయ్యాడు. ఎన్సీఏలో కోలుకుంటున్నాడు.
కేఎల్ రాహుల్
ప్రాక్టీస్లో మణికట్టు బెణకడంతో ఒక టెస్టు కూడా ఆడకుండానే కేఎల్ రాహుల్ స్వదేశానికి పయనమయ్యాడు. రాహుల్ గాయపడిన విషయాన్ని సిడ్నీ టెస్టుకు ముందు బీసీసీఐ తెలిపింది.
రవీంద్ర జడేజా
తొలి వన్డేలో తొడకండరాల గాయంతో ఇబ్బంది పడిన రవీంద్ర జడేజా త్వరగా కోలుకుని రెండో టెస్టు నుంచి జట్టుతో చేరాడు. కానీ సిడ్నీ టెస్టులో మరోసారి గాయపడ్డాడు. స్టార్క్ వేసిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ టెస్టుకు కూడా అతడు దూరం కానున్నాడు.
రిషభ్ పంత్
సిడ్నీ టెస్టులో పంత్ మోచేతికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో వికెట్కీపింగ్ బాధ్యతల్ని సాహా నిర్వర్తించాడు. అయితే స్కానింగ్లో తీవ్రగాయాలు కాలేదని తెలియడంతో పెయిన్ కిల్లర్ తీసుకుని పంత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. ఆఖరి టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు.
హనుమ విహారి
సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారి ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. గ్రేడ్-2 స్థాయిలో పిక్క గాయమైంది. దీంతో బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో లేడు.
రవిచంద్రన్ అశ్విన్
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర నడుం నొప్పితోనే మూడో టెస్టు ఆడాడు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టుకు అనుమానమే అని భావిస్తున్నారంతా. అయితే ఫిజియో, వైద్యసాయంతో అశ్విన్ బ్రిస్బేన్ టెస్టు ఆడే అవకాశం ఉంది.
మయాంక్ అగర్వాల్
పేలవ ప్రదర్శనతోనే మయాంక్ మూడో టెస్టుకు దూరమయ్యాడని భావించారు. కానీ ప్రాక్టీస్ సెషన్లో చేతికి గాయమవ్వడంతో అతడిని స్కానింగ్కు తీసుకువెళ్లారు. కాగా, విహారి ఆఖరి టెస్టుకు దూరమవ్వడంతో నొప్పితోనే మయాంక్ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.
జస్ప్రీత్ బుమ్రా
ఇషాంత్, ఉమేశ్, షమి దూరమైనా యువపేసర్లతో బుమ్రా బౌలింగ్ దళాన్ని నడపించాడు. అయితే బుమ్రా కూడా ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. పొత్తి కడుపు నొప్పితో బ్రిస్బేన్ మ్యాచ్కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
వీళ్లతో పాటు పితృత్వ సెలవులపై కోహ్లీ కూడా చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. అయితే కీలక ఆటగాళ్లు దూరమైనా మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, నటరాజన్తో పేస్ విభాగం బలంగానే ఉంది. కానీ అనుభవం లేని ఈ పేస్ దళం ఆసీస్ బ్యాట్స్మెన్ను ఎలా కట్టడిచేస్తారనేది ప్రశ్న. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక వృద్ధిమాన్ సాహా, పృథ్వీ షాతో బ్యాటింగ్ రిజర్వ్ బెంచ్ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే విహారి, జడేజా, బుమ్రా ఆఖరి టెస్టుకు దూరమవ్వడంతో జట్టు కూర్పు ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. జనవరి 15న బ్రిస్బేన్ వేదికగా ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.
- ఇంటర్నెట్డెస్క్
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?