Virat Kohli: 2008లో ఆర్సీబీ తీసుకున్న ధరకు ఆశ్చర్యపోయా: కోహ్లీ
ఐపీఎల్ భారత క్రికెట్కే తలమానికం. ఈ మెగా ఈవెంట్తో దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరోస్థాయికి చేరింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులు...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ భారత క్రికెట్కే తలమానికం. ఈ మెగా ఈవెంట్తో దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరోస్థాయికి చేరింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులు.. తమనుతాము నిరూపించుకొనేందుకు సరైన వేదికగా మారింది. ఇక్కడ అవకాశం వచ్చి ఒక్కసారి క్లిక్ అయితే ఆటగాళ్ల దశ-దిశ మారిపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ మెగా ఈవెంట్లో ఆడాలనుకుంటారు. ప్రస్తుతం టీమ్ఇండియాలో స్టార్లుగా కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లు సైతం ఈ మెగా ఈవెంట్ నుంచే వెలుగులోకి వచ్చారు. అందులో బ్యాటింగ్ గ్రేట్, మాజీ సారథి విరాట్ కోహ్లీ సైతం ఉన్నాడు. అతడు తొలిసారి 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికైనప్పుడు తనని కొనుగోలు చేసిన ధర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు.
తాజాగా ఆర్సీబీ జట్టు తమ క్రికెటర్లతో ఓ ఆసక్తికరమైన వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో ఐపీఎల్ తమ కెరీర్లను ఎలా మార్చిందని విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, దేవ్దత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్వెల్లను అడిగింది. ఈ క్రమంలోనే కోహ్లీ మాట్లాడుతూ తన ఐపీఎల్ ఎంట్రీపై ఇలా చెప్పుకొచ్చాడు. ‘2008లో ఐపీఎల్ వేలం జరిగేటప్పుడు మేమంతా అండర్-19 ప్రపంచకప్ కోసం మలేసియాలో ఉన్నాం. ఆ రోజు నాకింకా గుర్తుంది. అప్పుడు మమ్మల్ని ఎంత ధరకు తీసుకోవాలని నిర్ణయించారో తెలిసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అది చాలా పెద్ద మొత్తం. అయితే, నన్ను దిల్లీ టీమ్ తీసుకోవాలని చూసినా వాళ్ల పరిస్థితులకు పేస్ బౌలర్ను తీసుకోవాలనుకున్నారు. దాంతో అప్పుడు మా అండర్-19లోని అత్యుత్తమ బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ను తీసుకున్నారు. నేనేమో ఆర్సీబీకి వెళ్లాను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
‘బెంగళూరు టీమ్ నన్ను తీసుకోవడం నా జీవితంలోనే ప్రత్యేకమైన సందర్భం. దాంతో ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు తిరిగి వెనక్కి చూసుకుంటే నాటి పరిస్థితులు మరోలా ఉన్నాయనిపిస్తోంది. అలాగే నన్ను నేను ఆర్సీబీలో తప్ప మరే జట్టులోనూ చూడాలనుకోవడం లేదు. నాకు మాటల ఊరట కన్నా నిజాయితీగా ఉండటమే ముఖ్యం. నేను ఐపీఎల్ ఆడే చివరి రోజు వరకూ ఈ జట్టులోనే కొనసాగుతా’ అని మాజీ సారథి వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)