Sarfaraz Khan : ఆడితే ముంబయి జట్టుకే.. లేకపోతే వీడ్కోలు చెబుతా!: సర్ఫరాజ్ ఖాన్
ముంబయిపై మధ్యప్రదేశ్ ఫైనల్లో విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆసాంతం రాణించిన ..
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిపై మధ్యప్రదేశ్ ఫైనల్లో విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆసాంతం రాణించిన ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు. 122.75 సగటుతో 982 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 275 పరుగులు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ మ్యాచ్లకు సంబంధించి సర్ఫరాజ్ ఖాన్ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఒకానొక సమయంలో ఆడితే ముంబయి జట్టు తరఫునే క్రికెట్ ఆడాలని.. లేకపోతే ఆటకే వీడ్కోలు పలకాలని భావించినట్లు పేర్కొన్నాడు. తొలుత ముంబయికే ప్రాతినిధ్యం వహించిన సర్ఫరాజ్ 2015-18 వరకు ఉత్తర్ప్రదేశ్కు వెళ్లిపోయాడు. అయితే మళ్లీ 2020 సీజన్ నాటికి ముంబయి టీమ్లోకి వచ్చేశాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగే చూసే అవకాశం రాలేదు.
‘‘రంజీ ట్రోఫీలో శతకం చేసినప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యా. నేను గతంలో ముంబయి నుంచి ఉత్తర్ప్రదేశ్ తరఫున ఆడేందుకు వెళ్లేటప్పుడు ముంబయి జెర్సీని పక్కన పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఎంతో ఏడ్చాను. ఎందుకంటే ముంబయి జెర్సీని ధరించి సెంచరీ చేయాలనేది నా కోరిక. పేపర్లో నా ఫొటో కనిపించాలని ఆశగా ఉండేది. కానీ అప్పుడు అది నెరవేరేదిగా అనిపించలేదు’’ అని సర్ఫరాజ్ వివరించాడు. అయితే రెండేళ్లకే ఉత్తర్ ప్రదేశ్ టీమ్ నుంచి ముంబయి జట్టుకు మారిపోయాడు.
‘‘ఒకసారి మా నాన్నతో ఓ మాట అన్నాను. ముంబయి జట్టు తరఫున క్రికెట్ ఆడకపోతే.. ఆటకే వీడ్కోలు పలుకుతా అని చెప్పా. ఉత్తర్ప్రదేశ్ టీమ్ నుంచి బయటకు వచ్చాక ఓ సంవత్సరం పాటు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించా. ఆ సమయంలో క్లబ్ క్రికెట్ మాత్రమే ఆడా. నా జీవితంలో కష్టంగా గడిపిన సమయమదే. ఆ తర్వాత ముంబయి జట్టులోకి పునరాగమనం చేశా. 2020లో ఉత్తర్ప్రదేశ్పైనే ట్రిపుల్ సెంచరీ సాధించా. రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి తరఫున సెంచరీ బాదాలనేది నా కోరిక. అది తీరిపోయింది. మిగతా మ్యాచుల్లో శతకాలు బాదినా.. ఫైనల్లో కొడితే ఎంతో ప్రత్యేకం’’ అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం