రూట్.. రైట్ రైట్! కోహ్లీ ఆపగలడా?
అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే క్రికెట్పై పరిణతి సాధించాడు. మరికొన్నేళ్లకే జట్టుకు నాయకుడిగా ఎదిగాడు. సంప్రదాయ క్రికెటింగ్ షాట్లు ఆడటంలో సిద్ధహస్తుడు. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా తొణకని వీరుడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్న తేడా లేకుండా కొన్ని రోజుల ముందే శ్రీలంకపై పరుగుల వరద పారించాడు....
స్వీప్ షాట్తో మాయ చేస్తున్న ఇంగ్లాండ్ సారథి
అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే క్రికెట్పై పట్టు సాధించాడు. మరికొన్నేళ్లకే జట్టుకు నాయకుడిగా ఎదిగాడు. సంప్రదాయ క్రికెటింగ్ షాట్లు ఆడటంలో సిద్ధహస్తుడు. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా తొణకని వీరుడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్న తేడా లేకుండా కొన్ని రోజుల ముందే శ్రీలంకపై పరుగుల వరద పారించాడు. ఇప్పుడు టీమ్ఇండియాతో ఢీ అంటున్నాడు. అతడే ఇంగ్లాండ్ సారథి జో రూట్. కోహ్లీసేనతో సమరానికి రైట్.. రైట్ అంటున్న అతడి జోరుకు అడ్డుకట్ట వేసేదెలా? ఉపఖండంలో అతడి పరిస్థితి ఏంటి?
బిగ్-4.. పోరుపై ఉత్కంఠ
సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ‘బిగ్ 4’ అంటే విరాట్ కోహ్లీ, విలియమ్సన్, స్టీవ్స్మిత్, జోరూట్. దాదాపుగా వీరి వయసు, ఆటతీరు, జట్టులో ప్రాముఖ్యం ఒకేలా ఉంటుంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్నా టెస్టు క్రికెట్కే మరింత ప్రాధాన్యం ఇస్తారు. నాయకులుగా తమ జట్లపై తమదైన ముద్రవేశారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు మైదానంలో తలపడ్డా ఆసక్తికరంగా ఉంటుంది. అభిమానులు, విశ్లేషకుల్లో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ కలుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి ఉపఖండంలో కోహ్లీ, జో రూటు ఎదురుపడనున్నారు. తండ్రైన ఆనందంలో విరాట్ ఉంటే లంకేయులపై విధ్వంసకర శతకాలు చేసి 2-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన సంతోషంలో రూట్ ఉన్నాడు. అతడిని ఆపడం టీమ్ఇండియాకు అత్యంత అవసరం. లేదంటే నిలకడ, పట్టుదలకు మారుపేరైన అతడు భారత్లోనూ పరుగుల వరద పారించడం ఖాయం.
ద్విశతకం.. శతకం
అదేంటో శ్రీలంక అంటే చాలు జోరూట్ విరుచుకుపడుతున్నాడు. అతడి నేతృత్వంలో గత పర్యటనలో 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లాండ్ ఈ సారీ 2-0తో సిరీసును ఊడ్చేయడం గమనార్హం. ముఖ్యంగా ప్రస్తుత విజయాల్లో కీలక పాత్ర పోషించింది కెప్టెన్ జో రూట్ అనడంలో సందేహమే లేదు. 4 ఇన్నింగ్సుల్లో 106.50 సగటు, 65.63 స్ట్రైక్రేట్తో 649 బంతులు ఎదుర్కొని 426 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం ప్రత్యేకం. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో అతడు 321 బంతులు ఎదుర్కొని 71.03 స్ట్రైక్రేట్తో 228 పరుగులు చేశాడు. ద్విశతకంతో ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టాడు. ఇందుకోసం దాదాపుగా ఎనిమిది గంటలు క్రీజులో నిలిచాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ రూట్ 309 బంతులాడి 186 పరుగులు చేశాడు. రూట్ను ఔట్ చేసేందుకు లంకేయులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అలసిపోవడంతో రూట్ వికెట్ ఇచ్చాడే గానీ అంత సులువగా ఔటవ్వలేదు.
స్వీప్ షాట్తో 25% పరుగులు
స్పిన్ ప్రభావం చూపించే శ్రీలంకలో జో రూట్ 426 పరుగులు చేశాడంటే కారణం ‘స్వీప్ షాట్’. సాధారణంగా టర్న్ అయ్యే బంతుల్ని ఎదుర్కొనేందుకు బ్యాట్స్మెన్ వాడే ప్రధాన అస్త్రం స్వీప్. అయితే అందరూ దీన్నంత సమర్థంగా ఆడలేరు. రూట్ హిట్టవ్వడానికి మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడానికి కారణమిదే. అతనాడినంత సమయోచితంగా, కచ్చితత్వంతో ఇంగ్లాండ్లోని ఇతర ఆటగాళ్లు ఆడలేకపోయారు. లంక సిరీసులో రూట్ 37 బౌండరీలు, 1 సిక్సర్ బాదాడు. అందులో 16 బౌండరీలు స్వీప్ షాట్ ద్వారానే లభించాయి. మొత్తంగా 105 పరుగులు స్వీప్ ద్వారా రాబట్టాడు. దాదాపు 25% పరుగులు ఇలానే వచ్చాయి. టీమ్ఇండియాతో ఇంగ్లాండ్ తలపడే తొలి రెండు టెస్టులకు వేదిక చెపాక్. దాదాపుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు గాలెకు మరీ భిన్నంగా ఏమీ ఉండవు. పిచ్ సైతం మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లే ప్రభావం చూపుతారు. ఇక్కడా రూట్ ప్రధాన అస్త్రం స్వీప్షాటే కానుంది.
భారత్పై మెరుగే
భారత్లో రూట్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడాడు. 49.24 స్ట్రైక్రేట్, 53.09 సగటుతో 584 పరుగులు చేశాడు. అతడి కెరీర్ సగటు 49.39తో పోలిస్తే ఉపఖండంలోనే సగటు ఎక్కువ. 2016 పర్యటనలో రాజ్కోట్లో శతకం (124) బాదేశాడు. నాగ్పుర్ (73), విశాఖపట్నం (53), మొహాలి (78), ముంబయి (77), చెన్నై (88)లో అర్ధశతకాలు సాధించాడు. ఆడిన ప్రతి మైదానంలో ఏదో ఒక ఇన్నింగ్స్లో అర్ధశతకం చేస్తుండటం రూట్ ప్రత్యేకత. గతంలో జట్టు సభ్యుడిగా వచ్చిన అతడు ఈ సారి నాయకుడిగా అడుగుపెడుతున్నాడు. లంకలో స్పిన్ను చక్కగా ఎదుర్కొన్న అతడు ఇక్కడా అదే పనిచేస్తాడని చాలామంది అంచనా వేస్తున్నారు.
క్యాచులు ఇచ్చేలా వ్యూహం
క్రీజులో నిలిస్తే వికెట్ ఇవ్వని రూట్ ఎక్కువగా క్యాచ్ (61)లు ఇచ్చి వెనుదిరిగాడు. కీపర్ క్యాచుల ద్వారా 48 సార్లు పెవిలియన్ చేరాడు. 27 సార్లు వికెట్ల ముందు దొరికపోతే 23 సార్లు బౌల్డ్ అయ్యాడు. 8 సార్లు రనౌట్ అయ్యాడు. టీమ్ఇండియాపైనా అతడి పరిస్థితి ఇదే. క్యాచుల ద్వారా 10, కీపర్ క్యాచుల ద్వారా 4, ఎల్బీడబ్ల్యూ ద్వారా 8, రనౌట్ ద్వారా 2, బౌల్డ్ ద్వారా ఒకసారి పెవిలియన్ చేరుకున్నాడు. రవీంద్ర జడేజా అతడిని అత్యధిక సార్లు ఔట్ చేశాడు. 20 ఇన్నింగ్సుల్లో 5 సార్లు పెవిలియన్ పంపించాడు. అశ్విన్ బౌలింగ్లో రూట్ మూడుసార్లు క్యాచులు ఇచ్చాడు. బుమ్రా 6 ఇన్నింగ్సుల్లోనే 2 సార్లు ఔట్ చేయడం గమనార్హం. జయంత్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ 2, మహ్మద్ షమి 2 సార్లు పెవిలియన్ పంపించారు. మొత్తంగా పేసర్ల బౌలింగ్లో రూట్ వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్లో కీపర్ లేదా ఫీల్డర్లకు క్యాచ్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు సమన్వయ లోపం, గందరగోళంతో రనౌట్ అవుతుంటాడు. త్వరలో జరగబోయే సిరీసులో టీమ్ఇండియా వీటిని జాగ్రత్తగా గమనించి వ్యూహాలు రచిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. సొంత మైదానంలో అశ్విన్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలకమవుతారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?