IPL: హైదరాబాద్‌ ఆటగాడికి కరోనా 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)ను కరోనా వెంటాడుతోంది.

Updated : 04 May 2021 13:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)ను కరోనా వెంటాడుతోంది. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా కరోనా బారిన పడ్డారు. దీంతో హైదరాబాద్‌, ముంబయి జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడుతుండటంతో లీగ్‌ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై లీగ్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్‌ లీగ్‌ను బీసీసీఐ రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని