Hardik Pandya : ప్రస్తుతం నా దృష్టంతా గుజరాత్ టైటాన్స్పైనే: హార్దిక్
గత రెండేళ్లుగా పెద్దగా క్రికెట్ ఆడని టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్లో..
ఇంటర్నెట్ డెస్క్: గత రెండేళ్లుగా పెద్దగా క్రికెట్ ఆడని టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం తాను ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’లో ఉన్నానని, గుజరాత్ టైటాన్స్ను నడిపించడంపైనే దృష్టి పెట్టినట్లు హార్దిక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియోలో హార్దిక్ మాట్లాడుతూ.. ‘‘గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యా. ఆ సమయంలో నా కుటుంబంతో గడిపాను. కష్టపడటం అనేది ఎప్పుడూ ఉండేదే. నావరకైతే
బాగా సన్నద్ధమయ్యానని గ్యారంటీగా చెప్పగలను. స్వీయ సమీక్షకు మంచి అవకాశంగా భావించా’’ అని తెలిపాడు.
మెగా వేలానికి ముందు హార్దిక్ను ముంబయి ఇండియన్స్ రిటెయిన్ చేసుకోకపోవడం, తర్వాత గుజరాత్ టైటాన్స్ ఎంపిక చేసుకుని కెప్టెన్సీని అప్పగించింది. ‘‘టీమ్ఇండియాలోకి ఇది అడుగు పెట్టేందుకు అవకాశం అని భావించడం లేదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే నా ముందున్న కర్తవ్యం. ఐపీఎల్లో నా జట్టు విజయం కోసం ఏం చేయాలనే దానిపైనే దృష్టిసారిస్తున్నా’’ అని హార్దిక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.