Hardik Pandya : ప్రస్తుతం నా దృష్టంతా గుజరాత్‌ టైటాన్స్‌పైనే: హార్దిక్‌

 గత రెండేళ్లుగా పెద్దగా క్రికెట్‌ ఆడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌లో..

Published : 20 Mar 2022 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత రెండేళ్లుగా పెద్దగా క్రికెట్‌ ఆడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ సీజన్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం తాను ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’లో ఉన్నానని, గుజరాత్‌ టైటాన్స్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టినట్లు హార్దిక్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘‘గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యా. ఆ సమయంలో నా కుటుంబంతో గడిపాను. కష్టపడటం అనేది ఎప్పుడూ ఉండేదే. నావరకైతే
బాగా సన్నద్ధమయ్యానని గ్యారంటీగా చెప్పగలను.  స్వీయ సమీక్షకు మంచి అవకాశంగా భావించా’’ అని తెలిపాడు. 

మెగా వేలానికి ముందు హార్దిక్‌ను ముంబయి ఇండియన్స్‌ రిటెయిన్‌ చేసుకోకపోవడం, తర్వాత గుజరాత్‌ టైటాన్స్ ఎంపిక చేసుకుని కెప్టెన్సీని అప్పగించింది. ‘‘టీమ్ఇండియాలోకి ఇది అడుగు పెట్టేందుకు అవకాశం అని భావించడం లేదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే నా ముందున్న కర్తవ్యం. ఐపీఎల్‌లో నా జట్టు విజయం కోసం ఏం చేయాలనే దానిపైనే దృష్టిసారిస్తున్నా’’ అని హార్దిక్‌ వివరించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని