Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించాలని తనకు వచ్చిన ఆఫర్పై భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు కోచ్గా ఎందుకు అవకాశం రాలేదో కారణాలు వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించాలని తనకు వచ్చిన ఆఫర్పై డ్యాషింగ్ ఓపెనర్, భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనిల్కుంబ్లే(Anil Kumble) అనంతరం టీమ్ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని తనను అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి కోరినట్లు తెలిపాడు. అయితే తర్వాత తనకు కోచ్గా ఎందుకు అవకాశం రాలేదో కారణాలు వివరించాడు. వారు తనని కలవకపోయుంటే తాను కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని కాదన్నాడు. కోహ్లీకి, కుంబ్లేకి మధ్య సక్యత కుదరకపోవడంతో వారు తనని కలిసి కోచ్ పోస్టుకు దరఖాస్తు చేయమని కోరినట్లు వీరూ వెల్లడించాడు.
ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో మాట్లాడిన సెహ్వాగ్.. పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ‘‘విరాట్కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఒకవేళ నన్ను కలవకపోయుంటే నేను టీమ్ఇండియా ప్రధాన కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని కాదు. మా మధ్య సమావేశం జరిగింది. విరాట్కోహ్లీ, అనిల్కుంబ్లే మధ్య సక్యత కుదరట్లేదని అందువల్ల మీరు కోచ్ స్థానాన్ని తీసుకోవాలని అమితాబ్ నన్ను కోరాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోచ్గా కుంబ్లే గడువు ముగుస్తుందని తెలిపాడు. దాని తర్వాత మీరు జట్టుతో వెస్టిండీస్లో పర్యటించాల్సి ఉంటుందన్నాడు. నేను నా నిర్ణయాన్ని తెలియజేయలేదు కానీ, వెస్టిండీస్కి వెళ్లాలంటే నాకు సహాయక శిక్షణ బృందం కావాలని అడిగాను. సహాయక శిక్షకుడు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ కావాలన్నాను. సహాయక సిబ్బందిని నేనే ఎంపికచేయాలన్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. దాంతో నేను వెస్టిండీస్కి వెళ్లలేదు’’ అని వివరించాడు. కుంబ్లే అనంతరం రవిశాస్త్రి టీమ్ఇండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
-
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
-
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు