Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించాలని తనకు వచ్చిన ఆఫర్పై భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు కోచ్గా ఎందుకు అవకాశం రాలేదో కారణాలు వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించాలని తనకు వచ్చిన ఆఫర్పై డ్యాషింగ్ ఓపెనర్, భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనిల్కుంబ్లే(Anil Kumble) అనంతరం టీమ్ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని తనను అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి కోరినట్లు తెలిపాడు. అయితే తర్వాత తనకు కోచ్గా ఎందుకు అవకాశం రాలేదో కారణాలు వివరించాడు. వారు తనని కలవకపోయుంటే తాను కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని కాదన్నాడు. కోహ్లీకి, కుంబ్లేకి మధ్య సక్యత కుదరకపోవడంతో వారు తనని కలిసి కోచ్ పోస్టుకు దరఖాస్తు చేయమని కోరినట్లు వీరూ వెల్లడించాడు.
ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో మాట్లాడిన సెహ్వాగ్.. పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ‘‘విరాట్కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఒకవేళ నన్ను కలవకపోయుంటే నేను టీమ్ఇండియా ప్రధాన కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని కాదు. మా మధ్య సమావేశం జరిగింది. విరాట్కోహ్లీ, అనిల్కుంబ్లే మధ్య సక్యత కుదరట్లేదని అందువల్ల మీరు కోచ్ స్థానాన్ని తీసుకోవాలని అమితాబ్ నన్ను కోరాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోచ్గా కుంబ్లే గడువు ముగుస్తుందని తెలిపాడు. దాని తర్వాత మీరు జట్టుతో వెస్టిండీస్లో పర్యటించాల్సి ఉంటుందన్నాడు. నేను నా నిర్ణయాన్ని తెలియజేయలేదు కానీ, వెస్టిండీస్కి వెళ్లాలంటే నాకు సహాయక శిక్షణ బృందం కావాలని అడిగాను. సహాయక శిక్షకుడు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ కావాలన్నాను. సహాయక సిబ్బందిని నేనే ఎంపికచేయాలన్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. దాంతో నేను వెస్టిండీస్కి వెళ్లలేదు’’ అని వివరించాడు. కుంబ్లే అనంతరం రవిశాస్త్రి టీమ్ఇండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.