Virat Kohli: కివీస్తో మూడో వన్డేలోనైనా విరాట్ రాణించాలి: వసీం జాఫర్
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి ప్రదర్శనపై భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కివీస్తో జరగనున్న మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాణిస్తాడని ఆశిస్తున్నట్లు భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ తెలిపాడు. విరాట్ కొంతకాలంగా లెగ్ స్పిన్ను ఎదుర్కోలేకపోతున్నాడని పేర్కొన్నాడు. కివీస్తో రెండు వన్డేల్లోనూ సాంట్నర్ వేసిన స్పిన్కు విరాట్ పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే.
‘‘ఈ సిరీస్లో విరాట్ ప్రదర్శన నిరాశపరిచింది. అతడు కొంతకాలంగా లెగ్ స్పిన్ ఎదుర్కోలేక పోతున్నాడు. కివీస్తో రెండు వన్డేల్లోనూ మిచెల్ సాంట్నర్ వేసిన స్పిన్కు ఔటయ్యాడు. మూడో వన్డేలోనైనా అతడు రాణించి మంచి స్కోరు సాధిస్తాడని ఆశిస్తున్నా. భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ త్వరలోనే ప్రారంభమవనుంది. ఆసీస్ బౌలింగ్ విభాగం దృఢంగా ఉంది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆ జట్టులో ఉన్నాడు. అందువల్ల కోహ్లి తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. రెండో వన్డేలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మహమ్మద్ షమీ గొప్పగా రాణించాడు’’ అని జాఫర్ తెలిపాడు. కివీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ ఇప్పటికే 2-0 తో ఆధిక్యంలో ఉంది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఆఖరి వన్డే జనవరి 24న ఇందోర్లో జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా