Dhoni : భారీగా పరుగులిచ్చినా.. అతడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు : చాహల్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రశంసలు కురిపించాడు. భారత కెప్టెన్గా ధోని.. ఎల్లప్పుడూ తనకు మద్ధతుగా నిలిచాడని పేర్కొన్నాడు. భారీగా..
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచాడని లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. భారీగా పరుగులిచ్చినా.. ఒక్క మాట కూడా అనేవాడు కాదని చెప్పాడు.
‘దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టీ20 మ్యాచులో నేను 64 పరుగులు ఇచ్చాను. మహీ భాయ్ సూచనల మేరకు బౌలింగ్ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో వేరే వ్యక్తి కెప్టెన్గా ఉంటే కచ్చితంగా తిట్టేవాడే. కానీ, ధోని భాయ్ అలా చేయలేదు. నా కాన్ఫిడెన్స్ దెబ్బ తినకుండా.. క్రికెట్లో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంటుంది. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు నువ్వు మెరుగ్గానే ప్రయత్నించావు. కానీ, ఈ రోజు నీకు కలిసి రాలేదు. ఇంతకు ముందు వన్డే సిరీస్లో నువ్వు మెరుగ్గా బౌలింగ్ చేశావు. ఆడిన ప్రతి మ్యాచులో వికెట్లు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా గొప్పగా రాణించాలనుకుంటారు కదా!. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ వంతు 4 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేసి చిల్ అవ్వు అని ధోని భాయ్ ధైర్యం చెప్పాడు’ అని యుజ్వేంద్ర చాహల్ పేర్కొన్నాడు.
‘ఆ ఘటన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. క్రికెట్లో పరిస్థితులు మన నియంత్రణలో ఉండవని అర్థమయ్యింది. కొన్ని మ్యాచుల్లో గొప్పగా రాణిస్తుంటాం. మరికొన్నింట్లో దారుణంగా విఫలమవుతుంటాం. మనకు అనుకూలించని రోజున ఎక్కువగా ఒత్తిడికి గురవకుండా.. వేరే వాళ్లకు అవకాశమివ్వాలి’ అని చాహల్ పేర్కొన్నాడు. ధోని సారథ్యంలోనే చాహల్ 2016లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?