Virat Kohli : విరాట్ మటన్ రోల్ కోసం వెళ్తే.. దుండగులు వెంబడించారు: ప్రదీప్ సంగ్వాన్
టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ.. అండర్ - 19 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను కోహ్లీ మాజీ సహచర ఆటగాడు ప్రదీప్..
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ.. అండర్ - 19 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను కోహ్లీ మాజీ సహచర ఆటగాడు ప్రదీప్ సంగ్వాన్ తాజాగా బయటపెట్టాడు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘జూనియర్ క్రికెట్లో మేమిద్దరం ఏడేనిమిదేళ్లు ఒకే రూమ్ను పంచుకున్నాం. ఆ సమయంలో అండర్ - 19 ప్రపంచకప్ కోసం మేం దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విరాట్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి స్ట్రీట్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. కోర్మా రోల్స్, చికెన్ రోల్స్ లాంటివి బాగా తినేవాడు. మేం బస చేస్తున్న హోటల్కి కొద్ది దూరంలో రుచికరమైన మటన్ రోల్ దొరుకుతుందని తెలిసింది. మా కార్ డ్రైవర్ కూడా అక్కడ భోజనం చాలా బాగుంటుందని చెప్పాడు. కానీ, ఈ మధ్యే అక్కడ గొడవ జరిగి ఓ వ్యక్తి చేయి నరికాడని అన్నాడు. దాంతో నేను చాలా భయపడిపోయాను. విరాట్ మాత్రం ‘ఏం కాదు.. వెళ్దాం పదా’ అని నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. మేం భోజనం చేసి బయలు దేరే సమయంలో కొంతమంది దుండగులు మమ్మల్ని వెంబడించారు. దీంతో వెంటనే కార్ స్టార్ట్ చేసి.. మేం బస చేస్తున్న హోటల్ చేరే వరకు ఎక్కడా ఆగకుండా వచ్చేశాం’ అని ప్రదీప్ సంగ్వాన్ పేర్కొన్నాడు.
* టీమ్ఇండియాకు ఎంపికయ్యాక చాలా బరువు తగ్గాడు..
‘విరాట్ టీమిండియాకు ఎంపికయ్యాక డైట్ విషయంలో చాలా కచ్చితంగా ఉండేవాడు. తన బరువును తగ్గించుకునేందుకు.. కఠినమైన డైట్ను పాటించేవాడు. మటన్ రైస్కు బదులుగా ఉడకబెట్టిన మొలకలు, గుడ్లు, సలాడ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినేవాడు. అది కూడా రోజుకి ఇంతని తూకం వేసుకుని మరీ తినేవాడు. దీంతో మూడు నెలల్లోనే.. దాదాపు 12 కిలోల బరువు తగ్గాడు. శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటేనే.. మైదానంలో చురుగ్గా కదలగలమని చెప్పేవాడు. అలా తన ఫిట్నెస్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు’ అని ప్రదీప్ సంగ్వాన్ అన్నాడు.
2008లో అండర్ - 19 ప్రపంచకప్ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించాడు. రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, సిద్ధార్థ్ కౌల్, సౌరభ్ తివారీ, ప్రదీప్ సంగ్వాన్ తదితరులు అండర్ -19 జట్టులో కోహ్లీ సహచర ఆటగాళ్లన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు