Asia Cup Final: ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే..!
ఆసియా కప్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి ఆసియా కప్ను అందుకుంది.........
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి ఆసియా కప్ను అందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో ఓ కీలకమైన క్యాచ్ను పాక్ ఫీల్డర్లు ఢీకొని నేలపాలు చేయడం శ్రీలంకకు కలిసొచ్చింది. క్యాచ్ను జారవిడవడమే కాదు.. ఏకంగా ఆరు పరుగులు సమర్పించుకున్నారు కూడా. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన లంక జట్టులో రాజపక్స మినహా ఇక మిగిలింది బౌలర్లు మాత్రమే. అలాంటి కీలక సమయంలో రాజపక్స ఇచ్చిన ఆ క్యాచ్ను జారవిడవడంతో పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాచ్ను జారవిడిచినవారిలో ఒకరైన వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ మ్యాచ్లో షాదాబ్ రెండు క్యాచ్లను విడిచిపెట్టాడు.
మ్యాచ్ అనంతరం ట్వీట్ చేస్తూ.. ‘క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నా. నేను నా బృందాన్ని నిరాశపరిచాను’ అంటూ పేర్కొన్నాడు. జట్టు మొత్తం శాయశక్తులా ప్రయత్నించిందని.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, నవాజ్ త్రయం అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. మహ్మద్ రిజ్వాన్ గొప్పగా పోరాడాడని ప్రశంసించాడు. కప్ సాధించిన శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
18.6వ ఓవర్లో మహమ్మద్ హస్నైన్ వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించాడు. గాల్లో ఉన్న ఈ బంతిని అందుకొనేందుకు అక్కడే ఉన్న అసిఫ్ అలీ ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో షాదాబ్ ఖాన్ గుడ్డిగా ఆ దిశగా పరిగెత్తుకొంటూ వచ్చి అలీను ఢీకొన్నాడు. అప్పటికే అలీ చేతికందిన బంతి.. షాదాబ్ ఢీకొనడంతో బౌండరీ లైన్ బయటపడింది. ఫలితంగా వికెట్ కోల్పోవాల్సిన శ్రీలంకకు సిక్సర్ లభించింది. అప్పటికే జోరుమీదున్న రాజపక్స చివరి ఓవర్లో 14 పరుగులు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!