Shoaib Akhtar: అప్పుడు రాహుల్కు ఆగ్రహం వచ్చింది.. నాకు ఆశ్చర్యమేసింది: అక్తర్
ఎప్పుడైనా సరే భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు రసవత్తరంగా ఉండేవి. అభిమానులు, ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యేవారు. అయితే ఎల్లవేళలా...
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడైనా సరే భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు రసవత్తరంగా ఉండేవి. అభిమానులు, ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యేవారు. అయితే ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంటూ తన పనేదో చేసుకుపోయే రాహుల్ ద్రవిడ్ కూడా ఆగ్రహానికి గురైన సంఘటన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు చేసుకుంది. ఆ సంఘటనను పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ మ్యాచ్ జరిగిందే దాయాది దేశాల మధ్య.. అదీనూ ద్రవిడ్ కోపానికి గురైన ఆటగాడు అక్తర్ కావడం విశేషం. మ్యాచ్ సందర్భంగా ఒకరినొకరు తాకడంతో ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదెలా జరిగిందో షోయబ్ మాటల్లో..
‘‘భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్. ఈ సందర్భంగా ద్రవిడ్, నేనూ ఒకరికొకరం ఢీకొన్నాం. దీంతో ద్రవిడ్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నావైపు వచ్చాడు. అయితే నేను అటువైపు వెళ్తా.. నువ్వు ఇటువైపు వెళ్లు అని చెప్పా. దీంతో రాహుల్ మరింత రెచ్చిపోయాడు. ఇలా రాహుల్ ద్రవిడ్ను ఆగ్రహంతో చూడటం అదే ఫస్ట్టైమ్. ‘రాహుల్ నువ్వు చాలా అగ్రెసివ్ ఉన్నావు’ అని అన్నా. మైదానంలోని పరిస్థితులు మారిపోతాయని నాకు తెలుసు. ఇక రాహుల్ కూడా వదిలేశాడు. అందుకే ద్రవిడ్ను క్రికెట్ జెంటిల్మన్ అనేది. ఇక ఆ స్పెల్లో చాలా బాగా బౌలింగ్ చేశా. మేం ఓడినా.. విజయానికి చేరువగా వచ్చాం. 2003 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాపై చాలా బాగా ప్రభావం చూపా’’ అని అక్తర్ వివరించాడు.
భారత్ను తొలిసారి ఎదుర్కొన్నప్పుడు..
షోయబ్ అక్తర్ పాక్ తరఫున 1997లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 1999లో తొలిసారి టీమ్ఇండియాపై ఆడాడు. అప్పటికే భారత్కు సచిన్, సౌరభ్ గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ నాలుగేసి వికెట్లు తీసి పాక్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ను ఔట్ చేసి సంచలనం సృష్టించాడు. తొలిసారి భారత్తో ఆడేటప్పుడు తనకు కొన్ని సందేశాలు వచ్చాయని అక్తర్ వెల్లడించాడు. ఓ క్రీడా ఛానల్లో సెహ్వాగ్తో మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ అనుకుంటా ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి చెబుతూ.. ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలిస్తుంది. అందుకే నువ్వు ఆడుతున్నావు అని చెప్పాడు. ఇక భారత్తో నా తొలి టెస్టులో నేను బ్యాటర్ తల, పక్కెటెముకలను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ వేశా. దీంతో చాలామంది ‘బౌలింగ్తో చంపేస్తావా ఏంటి?’ అని టీమ్ఇండియా నుంచి సందేశాలు వచ్చేవి. ‘నేను ఔట్ చేయకూడదా..? అని వారితో అనేవాడిని. ‘నీ దగ్గర మంచి పేస్ ఉంది. అయితే దాంతో ప్రజలను చంపడానికి కాదు. ఔట్ చేయడమే మన కర్తవ్యం’ అని పలువురు ఆటగాళ్లు చెప్పేవారు. ఇదే విషయంపై సౌరభ్తో ‘నిన్ను ఔట్ చేయడం కాదు.. నీ పక్కటెముకలకు తగిలేలా బౌలింగ్ వేయాలనేది మా ప్లాన్’ అని అన్నాను. నా తొలి వన్డేలోనే సెహ్వాగ్ను ఔట్ చేయడం ఎప్పటికీ మరిపోలేను’’ అని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్