ఆ క్షణాల్ని సిరాజ్ తండ్రి చూడాల్సింది: అక్తర్
తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. ‘‘సిరాజ్కు..
ఇంటర్నెట్డెస్క్: తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. ‘‘సిరాజ్కు నా ప్రగాఢ సానుభూతి. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలిచారని భావిస్తున్నా. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటాయి. భారత్ తరఫున సిరాజ్ ఆడుతున్న క్షణాలను అతడి తండ్రి చూడాలని ఎంతో ఆశించాడు. కానీ అది జరగలేదు. అయితే సిరాజ్ భారత్కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, గొప్ప ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అలాంటి మధుర క్షణాలను అతడి తండ్రి చూడాల్సింది’’ అని అన్నాడు.
‘‘బాక్సింగ్ డే టెస్టులో సిరాజ్ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు. అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అతడికి ఎంతో ప్రతిభ ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తన వ్యక్తిత్వాన్ని తెలియజేశాడు’’ అని అక్తర్ తెలిపాడు. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి సిరాజ్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్లో ఉన్న సమయంలో సిరాజ్ తండ్రి అనారోగ్యంతో మరణించారు. భారత్కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు. భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్లోనే ఉండిపోయాడు.
కాగా, ఆస్ట్రేలియాపై విజయం సాధించడానికి కారణం భారత బౌలర్ల కృషేనని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ బ్యాట్స్మెన్ను ఎలా బోల్తా కొట్టించాలనే కోడ్ను టీమిండియా బౌలర్లు ఛేదించారని అన్నాడు. టెస్టు సిరీస్ విజయ మార్గంలో భారత్ పయనిస్తుందని పేర్కొన్నాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై మాట్లాడుతూ.. గులాబి బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే టీమిండియా ఓటమికి కారణమని అక్తర్ అన్నాడు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)