Virat Kohli: కోహ్లీ గెలిచి.. వారికి ఊరట కలిగించాలి
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెలవడానికి టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడని, ఒకవేళ అదే నిజమైతే అతడికది గొప్ప విశేషమని వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ ఇయాన్ బిషప్ ఆశాభావం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెలవడానికి టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడని, ఒకవేళ అదే నిజమైతే అతడికది గొప్ప విశేషమని వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ ఇయాన్ బిషప్ అన్నాడు. విరాట్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని, ఒక మంచి కెప్టెన్కు ఉండాల్సిన లక్షణమని చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కెప్టెన్పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘ఈ ఛాంపియన్షిప్ గెలవడం కోహ్లీకి అతిగొప్ప విశేషం. అతడు ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మంచి కెప్టెన్లకు ఉండాల్సిన లక్షణాల్లో అది ఒకటి. కేన్ విలియమ్సన్తో పాటు టాప్ లెవెల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. కోహ్లీలా బాగా ఆడేవాళ్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అయితే, అతడింకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా ట్రోఫీ గెలుపొందాలని అనుకుంటాడు. ఎందుకంటే దానికోసం అతడు చాలా కష్టపడ్డాడు. ఫాస్ట్ బౌలర్లపై నమ్మకం ఉంచి, జట్టులో మార్పులు చేసి సానుకూల దృక్పథం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. జట్టు కోసం, దేశం కోసం అతడి కెప్టెన్సీలో ఛాంపియన్షిప్ టైటిల్ ఉండాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం లేదు’ అని బిషప్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు కరోనా రెండో దశలో భారత్లో ఎంత తీవ్రంగా నష్టపోయిందో తెలిసిందే. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు దేశం తరఫున టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం సాధించి, ఆ ట్రోఫీతో బాధితులకు ఊరట కలిగించాలని బిషప్ కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో