IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ పోటీకు ముందు టీమ్ఇండియా (Team India), ఆస్ట్రేలియా (Australia) చివరి టెస్టు సిరీస్ను ఆడబోతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి మొదలుకానుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో నాలుగు టెస్టుల సిరీస్ను ఆడేందుకు ఆస్ట్రేలియా ఇక్కడకు రానుంది. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇరు జట్ల మధ్య ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే సిరీస్ ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ హీలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు సిరీస్లకు ముందు సన్నద్ధత కోసం సౌకర్యాలను అందించే విషయంలో దేశాల మధ్య సహకారం లోపించినట్లు ఉందన్నాడు. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు మంగళవారం (జనవరి 31) భారత్లో అడుగుపెట్టనుంది. ఇక్కడకు రాకముందే సిడ్నీ వేదికగా రెండు రోజుల ‘స్పిన్ క్యాంప్’ను నిర్వహించింది.
ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే భారత్తో నేరుగా టెస్టు సిరీస్ ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీసుకొన్న నిర్ణయాన్ని ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా స్వాగతించాడు. అయితే ఇయాన్ హీలీ మాత్రం ఖవాజాను తప్పుబట్టాడు. టెస్టు సిరీస్కు పిచ్లు పర్యాటక దేశాలకు అనుకూలంగా ఉండవు. వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రాక్టీస్ మ్యాచ్ తప్పకుండా ఉండాలని హీలీ చెప్పాడు.
‘‘ సిడ్నీలో ఆసీస్ స్పిన్నర్లు కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత్లో ఉన్నట్లుగానే పిచ్లను తయారు చేసి మరీ బంతులను సంధించారు. పర్యటించే దేశం అడిగే సౌకర్యాలను ఆతిథ్య జట్టు అందిస్తుందనే నమ్మకం ఇక నుంచి ఉండదు. అయితే మా దృష్టంతా అత్యుత్తమ క్రికెట్ ఆడటంతోపాటు భవిష్యత్తు క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంపైనే ఉంటుంది. ఇప్పటి నుంచి మేం కూడా సిరీస్ కోసం మా వద్దకు వచ్చే పర్యాటక దేశాలకు సరైన సన్నద్ధత నిరాకరించేందుకు అవకాశం ఉంది. అలాంటి మాకు ఇష్టం లేకపోయినా తప్పట్లేదు. ఇలా దేశాల మధ్య అపనమ్మకమైన సంబంధాలను చూడటం నిరుత్సాహంగా ఉంది. ఇలాంటివి ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఉంది’’
‘‘భారత్లో ఎలాంటి సన్నద్ధత లేకుండానే టెస్టు సిరీస్ను ఆసీస్ ఆడబోతోంది. పర్యాటక దేశాలకు ఇది చాలా ఇబ్బందే. 2004-2005 నుంచి ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో ఆసీస్ ఒక్క టెస్టు సిరీస్నూ నెగ్గలేకపోవడం ఆందోళనకరమే. ఈసారైనా ఆసీస్ గెలవాలని ఆశిస్తున్నా. రెండో టెస్టు.. మూడో టెస్టుకు మధ్య పది రోజుల వ్యవధి ఉండటం కూడా కలిసొస్తుంది’’ అని ఇయాన్ హీలీ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు