Team India U19: చేజారిందనుకున్న క్యాచ్.. ఆఖరి నిమిషంలో ఒంటి చేత్తో..
ఐసీసీ అండర్-19 ప్రపంచప్ తుదిపోరు రసవత్తరంగా ముగిసింది. యువ ఇంగ్లాండ్ జట్టుపై భారత కుర్రాళ్లు అదరగొట్టారు. తొలుత బంతితో కట్టడి చేసిన టీమ్ఇండియా...
(Photo: Twitter Video Screenshot)
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ అండర్-19 ప్రపంచప్ తుదిపోరు రసవత్తరంగా ముగిసింది. యువ ఇంగ్లాండ్ జట్టుపై భారత కుర్రాళ్లు అదరగొట్టారు. తొలుత బంతితో కట్టడి చేసిన టీమ్ఇండియా తర్వాత బ్యాటింగ్లో తడబడినా చివరికి మ్యాచ్ గెలుపొందింది. దీంతో ఐదోసారి మినీ వరల్డ్ కప్ను దక్కించుకుంది. అయితే, ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ జేమ్స్ ర్యూ (95; 116 బంతుల్లో 12×4) గొప్ప పోరాట పటిమ ప్రదర్శించాడు. 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఒంటి చేత్తో ముందుకు నడిపించాడు. కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనుకున్న ఇంగ్లాండ్కు పోరాడే స్కోర్ అందించాడు.
కాగా, టీమ్ఇండియా ఒక విధంగా ఈ మ్యాచ్లో గెలవడానికి అతడి వికెట్టే కీలకంగా మారింది. జేమ్స్ సేల్స్ (34; 65 బంతుల్లో 2x4)తో కలిసి జేమ్స్ ర్యూ ఎనిమిదో వికెట్కు 93 పరుగులు జోడించగా.. శతకానికి చేరువైన వేళ రవికుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్కు యత్నించి కౌశల్ తాంబే చేతికి చిక్కాడు. అయితే, ఈ క్యాచ్ అందుకునే క్రమంలో కౌశల్ తొలుత బంతిని అందుకున్నట్లే అనిపించినా జారవిడిచాడు. దీంతో క్యాచ్ మిస్ అయ్యింది అనుకుంటుండగానే మళ్లీ ముందుకు డైవ్ చేసి నేల మీద పడే బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ వెనుదిరగక తప్పలేదు. అతడు పెవిలియన్ చేరాక ఆ జట్టు మరో ఐదు పరుగులకే మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఛేదనలో భారత్ తడబడినా మ్యాచ్ గెలిచింది. కాగా, జేమ్స్ ర్యూ క్యాచ్ను ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆ అద్భుత క్యాచ్ను మీరూ చూసి ఆస్వాదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.