Virat Kohli: విరాట్కు 23 టెస్టుల నుంచి సెంచరీ లేదు.. ఐస్ల్యాండ్ క్రికెట్పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల కాలంలో వరుసపెట్టి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కానీ, టెస్టుల్లో మాత్రం సెంచరీ కోసం నిరీక్షణ తప్పడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవలే 25వేల పరుగులు సాధించాడు. అత్యంత తక్కువ మ్యాచుల్లోనే ఇలాంటి ఘనత సాధించిన బ్యాటర్గా మారాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. అదీనూ టీ20ల్లో కావడం విశేషం. ఇటీవల వన్డేలోనూ శతక నిరీక్షణకు తెరదించాడు. కానీ, టెస్టుల్లో మాత్రం సెంచరీ సాధించి మూడున్నరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్పై సెంచరీ సాధించాడు. దాదాపు 23 టెస్టుల నుంచి ఒక్క శతకం నమోదు కాలేదు. దక్షిణాఫ్రికాపై చేసిన 79 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. తాజాగా ఆసీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ 44, 20, 12 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఐస్ల్యాండ్ క్రికెట్ పెట్టిన ఓ ట్వీట్ మాత్రం ట్వీట్ వైరల్గా మారింది. విరాట్ అభిమానులకు మాత్రం రుచించడం లేదు. ఇంతకీ ఏమైందంటే..?
విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ క్రమంలో ఐస్ల్యాండ్ క్రికెట్ ‘‘విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు చెప్పే గణాంకాలు చాలామంది భారత అభిమానులకు నచ్చకపోవచ్చు. అయితే, విరాట్ కోహ్లీ సుదీర్ఘఫార్మాట్లో సెంచరీ సాధించి 23 టెస్టులు అయ్యాయి. చివరిసారిగా 2019లో సాధించాడు. ఇది చాలా సుదీర్ఘ కాలం..’’ అని ట్వీట్ చేసింది. దీంతో విరాట్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా పలు కామెంట్లు పెట్టారు.
‘‘అదేం కాదు. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. ఎందుకంటే 2020 నుంచి 2021 మధ్య వరకు కొవిడ్ కారణంగా పెద్దగా మ్యాచ్లే జరగలేదు. ఇప్పటి వరకు భారీగా సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ కనీసం మరో సంవత్సరం సమయం ఇవ్వాలి’’
‘‘విరాట్ ఒక్కో ఫార్మాట్లో ఫామ్ను అందిపుచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో సెంచరీలు బాదాడు. స్పిన్ కీలక పాత్ర పోషించిన టెస్టుల్లోనూ 44 (83), 21 (30) నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాడు’’
‘‘కేవలం సెంచరీలు చేసినంత మాత్రనా ఆటగాడిని అత్యుత్తమ బ్యాటర్గా పరిగణించలేం. స్థిరంగా పరుగులు రాబట్టాలి. శతకం చేయకపోయినా, మ్యాచ్లో అతడి చేసిన రన్స్ కీలకమైతే చాలు. కోహ్లీ గత కొన్ని మ్యాచుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..