Ashes Test Series: జట్టును నడిపించలేనప్పుడు కెప్టెన్గా కొనసాగడమెందుకు.? : రికీ పాంటింగ్
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్లో.. ఇంగ్లాండ్ ఇప్పటికే 0-2 తేడాతో వెనుకబడిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు..
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్లో.. ఇంగ్లాండ్ ఇప్పటికే 0-2 తేడాతో వెనుకబడిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు పరాజయం పాలవగా.. రెండో టెస్టులో చివరి వరకు పోరాడినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో అసహనానికి గురైన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాలకు బౌలర్లే కారణమని నిందించాడు. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్.. రూట్ తీరుపై ఘాటుగా స్పందించాడు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాల్సిన బాధ్యత కెప్టెన్దేనని సూచించాడు. జట్టు విజయం కోసం పదునైన వ్యూహాలను రచించాలని పేర్కొన్నాడు.
‘సీనియర్ బౌలర్లు అని కూడా చూడకుండా.. కెప్టెన్ జో రూట్ వారిని విమర్శించడం చాలా బాధగా అనిపించింది. ఆటగాళ్లు మెరుగ్గా రాణించలేనప్పుడు వారిని దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత కెప్టెన్దే. అవసరమైతే బౌలర్లు సరైన లెంగ్త్లో బంతులేసేలా సూచనలు చేయాలి. ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు రాబట్టవచ్చో ఆలోచించాలి. జట్టు విజయం కోసం పదునైన వ్యూహాలు రచించాలి. కెప్టెన్ ప్రణాళికతో ఏకీభవించని ఆటగాళ్లను పక్కన పెట్టే హక్కు కూడా కెప్టెన్కుంది. వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలి. కెప్టెన్సీ అంటే అదే. ఆ పని చేయలేనప్పుడు కెప్టెన్గా కొనసాగడంలో అర్థం లేదు’ అని రికీ పాంటింగ్ అన్నాడు.
‘ఇంగ్లాండ్ పిచ్లపై బౌలింగ్ చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదు. పిచ్ని బట్టి బౌలింగ్లో వైవిధ్యం చూపించాలి. ఈ విషయం గురించి రూట్.. బౌలర్లతో చర్చించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. 2017-18లో యాషెస్ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 0-4 తేడాతో గెలుచుకుంది. అప్పుడు చేసిన తప్పులనే ఇంగ్లాండ్ ఈ సిరీస్లో పునరావృతం చేస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం ఎలా బంతులేశారో ఇప్పుడు కూడా అలాగే వేస్తున్నారు. అదే ఇంగ్లాండ్ను దెబ్బ కొట్టింది. అయితే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే గాయం కారణంగా రూట్ ఫీల్డ్ నుంచి తప్పుకున్నాక.. నాలుగో రోజు నుంచి బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. అప్పటి నుంచి బౌలర్లు కొంచెం మెరుగ్గా రాణించారు. మరోవైపు, రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్ జట్టులో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. కానీ, స్వయానా ఇంగ్లాండ్ కోచ్.. జట్టు ఎంపికలో తప్పు జరిగిందని చెప్పడం విచిత్రం’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ