WTC Final: పుజారాను నిందిస్తూ ముందుకెళ్తారా?
టీమ్ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారాకు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ అండగా నిలిచారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఓటమికి అతడిని నిందిస్తే ఏం చేయలేమని తెలిపారు. న్యూజిలాండ్ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారని గుర్తు చేశారు. ...
కోహ్లీని పరోక్షంగా విమర్శించిన గావస్కర్
ముంబయి: టీమ్ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారాకు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ అండగా నిలిచారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఓటమికి అతడిని నిందిస్తే ఏం చేయలేమని తెలిపారు. న్యూజిలాండ్ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారని గుర్తు చేశారు. సారథి విరాట్ కోహ్లీని ఉద్దేశించే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
‘పుజారాను వేలెత్తి చూపుతూ భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడం కష్టం. అతడు డిఫెన్స్తో అడ్డుగోడగా నిలబడతాడు. టీమ్ఇండియా ఇన్నింగ్స్లకు ప్రాముఖ్యం తీసుకొస్తాడు. ఒక ఎండ్లో పాతుకుపోయి మరో ఎండ్లో బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కల్పిస్తాడు’ అని గావస్కర్ అన్నారు.
‘చూడండి, మీరు టీమ్ఇండియా సంగతి పక్కన పెట్టండి. న్యూజిలాండ్ బ్యాటింగూ మెల్లగానే సాగింది. ఎందుకంటే పరిస్థితులు బ్యాట్స్మెన్ కన్నా ఎక్కువగా బౌలర్లకే అనుకూలంగా ఉన్నాయి. డేవిడ్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ఆచితూచే ఇన్నింగ్స్లు ఆరంభించారు’ అని సన్నీ తెలిపారు.
బ్యాటింగ్ ద్వారా న్యూజిలాండ్ను విజేతగా నిలిపింది కెప్టెన్ కేన్ విలియమ్సన్. నిజానికి అతడూ 70 బంతుల్లో 7 పరుగులే చేశాడు. అతడి డిఫెన్స్ ద్వారా మిగతా బ్యాట్స్మెన్ లాభపడ్డారని సన్నీ అభిప్రాయపడ్డారు. పుజారాను విమర్శించడం మానేసి దీనిని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.
‘మీరంతా దానిని గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్ సైతం మెల్లగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. కానీ, మీరు పుజారాను వేలెత్తి చూపితే మాత్రం చేసేదేం లేదు. అవతలి ఎండ్లో ఆటగాడు స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు సాయపడే క్రికెటర్ పుజారా. డిఫెన్స్ అతడి శైలి అని అందరికీ తెలుసు’ అని సన్నీ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్