తొలిసారిగా భారత్తో భారత్-ఏ టెస్టు మ్యాచు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్ పర్యటనలో భారత్, భారత్-ఏ నాలుగు రోజుల సన్నాహక టెస్టులో తలపడనున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగే ఈ పోరుకు నార్తాంప్టన్షైర్ కౌంటీ మైదానం వేదిక కానుంది. తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదు. సాధారణంగా ఏదైనా జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి...
లండన్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్ పర్యటనలో భారత్, భారత్-ఏ నాలుగు రోజుల సన్నాహక టెస్టులో తలపడనున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగే ఈ పోరుకు నార్తాంప్టన్షైర్ కౌంటీ మైదానం వేదిక కానుంది. తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదు. సాధారణంగా ఏదైనా జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి ‘ఏ’ జట్టుతో సాధన మ్యాచుల్లో పోటీపడుతుంది. తీరిక లేని షెడ్యూలు, బయో బుడగ వల్ల ఈ సారి భారత్తో భారత్-ఏ తలపడుతుండటం గమనార్హం.
ఐదు టెస్టుల సిరీసు కోసం టీమ్ఇండియా ఆగస్టు, సెప్టెంబర్లో ఇంగ్లాండ్లో పర్యటించనుంది. తొలిటెస్టు ఆగస్టు 4న నాటింగ్హామ్లో మొదలవుతుంది. ‘భారత్, భారత్-ఏకు మేం స్వాగతం పలుకుతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లు ఈ వేసవిలో కౌంటీ గ్రౌండ్లో తలపడనున్నారు’ అని నార్తాంప్టన్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తెలిపింది.
‘ఆగస్టులో ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా నాలుగు రోజుల సన్నాహక టెస్టులో భారత్-ఏతో తలపడనుంది. జులై 28న రెండో వార్మప్ మ్యాచ్ కోసం భారత బృందం అక్కడి నుంచి లీసెస్టర్షైర్కు చేరుకుంటుంది’ అని కౌంటీ క్లబ్ వెల్లడించింది.
నాటింగ్హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4-8 వరకు తొలి టెస్టు జరగనుంది. ఇక రెండు (ఆగస్టు 12-16), నాలుగో టెస్టు (సెప్టెంబర్ 2-6)లకు వేదిక లండన్. మూడో (ఆగస్టు 25-29) టెస్టు లీడ్స్, ఐదో టెస్టు (సెప్టెంబర్ 10-14)కు మాంచెస్టర్లో జరుగుతాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్.. భారత్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టుతో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
ఇవీ చదవండి
బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడు
థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్