నేను ఫెయిల్ అవ్వాలని కొంతమంది కోరుకున్నారు.. కానీ నేను వదిలే రకం కాదు: రవిశాస్త్రి
బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చూసినా విఫలం కావాలని ..
ఇంటర్నెట్ డెస్క్: బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చూసినా విఫలం కావాలని కొంతమంది కాచుకుని ఉంటారని టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 2014-2021 వరకు మధ్యలో ఒక్క ఏడాది మినహా దాదాపు ఆరేళ్లపాటు రవిశాస్త్రి కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలోఎదురైన అనుభవాలను ఓ అంతర్జాతీయ పత్రికతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్గా పనిచేసిన రాబర్ట్ కీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఈర్ష్యతో ఉన్నవారిని ఎదుర్కోవాలంటే మన చర్మం మందంగా ఉండాలి. అది డ్యూక్ బాల్ కంటే గట్టిగా ఉండాలని రాబర్ట్ కీ చెప్పేవాడు. ఆయన ఈసీబీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇలాంటివి అనుభవించాడు. నాకు కూడా భారత్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీమ్ఇండియా కోచ్గా పని చేసే కాలంలో నేను ఎప్పుడు విఫలమవుతానా..? అని కొంతమంది కోరుకునేవారు. అయితే నేను వదిలే రకం కాదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
రవిశాస్త్రిలానే రాబర్ట్ కీ కూడా మంచి క్రికెట్ వ్యాఖ్యాత. చాలాఏళ్లపాటు కామెంటేటర్గా పనిచేశారు. ఎలాంటి అనుభవం లేకుండానే ఈసీబీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. దీనిని ఉటంకిస్తూ ‘‘నాకు కూడా కోచింగ్కు సంబంధించిన లెవల్ 1, లెవల్ 2 అనే బ్యాడ్జ్లు లేవు. డైరెక్ట్గా ప్రధాన కోచ్ పదవి వరించింది. దీంతో భారత్లోని కొంతమందికి ఇది నచ్చలేదు. ఈర్ష్యతో నేను విజయవంతం కాకూడదని బలంగా కోరుకున్నారు. అసూయంతో రగిలిపోయేవారు. అయితే నా చర్మం మందం.. ఎంత మందమంటే డ్యూక్ బంతిని తయారు చేసే లెథర్ కంటే కూడా గట్టిది. అందుకే అలాంటివి పట్టించుకోలేదు. అయితే అప్పటికే నాకు సారథిగా అనుభవం ఉంది. ఆటగాళ్లతో కమ్యూనికేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు’’ అని వివరించాడు.
రవిశాస్త్రి ప్రధాన కోచ్గా ఉన్నప్పుడే ఆసీస్పై వరుసగా రెండు సిరీస్లను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. విదేశాల్లో సిరీస్లను గెలవగలమని నిరూపించింది. ‘‘విదేశాల్లో సిరీస్లను నెగ్గడం అద్భుతం. చాలా దూకుడుగా, దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడాం. అంతేకాకుండా ఆటగాళ్ల ఫిట్నెస్ కూడా ఉన్నతస్థాయిలో ఉంది. విదేశీ పిచ్లపై 20 వికెట్లను తీయడం కోసం ఫాస్ట్ బౌలింగ్ దళం సిద్ధం చేసుకున్నాం. ఇక యాటిట్యూడ్ విషయంలోనూ తగ్గేదేలే అని నిరూపించాం. మరీ ముఖ్యంగా ఆసీస్తో ఆడేటప్పుడు ఆటగాళ్లకు ఒకటే చెప్పా.. ‘మీకు ఒకటి ఎదురైతే (స్లెడ్జింగ్ అయినా) వారికి మూడు తిరిగి ఇవ్వండి.. మన భాషలో రెండు, వారికి అర్ధమయ్యే భాషలో మరొకటి’అని దూకుడుగా ఉండాలని హితబోధ చేశా’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)