IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ( Border Gavaskar Trophy) లో కొంతమంది టీమ్ఇండియా ఆటగాళ్లు పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశముంది. మరి ఆ రికార్డులెంటో తెలుసుకుందామా!
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. తొలి టెస్టుకు నాగ్పుర్లోని వీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ చరిత్రాత్మక ట్రోఫీలో కొంతమంది టీమ్ఇండియా (Team India) క్రికెటర్లు పలు మైలురాళ్లను అందుకునే అవకాశముంది.
అశ్విన్ ఒక్క వికెట్ తీస్తే..
అరుదైన క్లబ్లో చేరేందుకు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అడుగుదూరంలో ఉన్నాడు. అతడు ఒక్క వికెట్ను తీసుకుంటే టెస్టుల్లో 450 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ మైలురాయిని అందుకున్న 9వ బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గానూ రికార్డు సృష్టిస్తాడు. అనిల్ కుంబ్లే (619) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 450 వికెట్ల క్లబ్లో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (675), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (566), మెక్ గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథణ్ లైయన్ (460) ఉన్నారు. ఈ సిరీస్లో అశ్విన్ మరో ఏడు వికెట్లు పడగొడితే.. హర్భజన్ సింగ్ (95)ని అధిగమించి టెస్టుల్లో ఆసీస్పై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా నిలుస్తాడు. అనిల్ కుంబ్లే (111) మొదటి స్థానంలో ఉన్నాడు.
జడేజా ఎనిమిది వికెట్ల దూరంలో
భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇప్పటివరకు 60 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టాడు. అతడు మరో ఎనిమిది వికెట్లు తీస్తే 250 వికెట్లు పడగొట్టిన బౌలర్ల క్లబ్లో చేరుతాడు. ఇప్పటివరకు ఎనమిది మ్యాచ్లే ఆడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ 47 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతడు మరో వికెట్లు తీస్తే 50 వికెట్ల క్లబ్లో చేరతాడు. ఫాస్ట్బౌలర్ మహమ్మద్ సిరాజ్ మరో నాలుగు వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు.
100 టెస్టుల క్లబ్లో పుజారా
టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు 98 టెస్టులు ఆడిన పుజారా మరో రెండు టెస్టులు ఆడితే 100 టెస్టుల క్లబ్లో చేరనున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, సౌరభ్ గంగూలీ, ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, సెహ్వాగ్లు ఈ ఘనత సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.