IND Vs AUS: వైజాగ్లో తగ్గిన వర్షం.. మ్యాచ్కు సర్వం సిద్ధం
భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది.
విశాఖపట్నం: భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది మైదానంలో కవర్లను తొలగించి వర్షపు నీటిని బయటకు పంపిచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లు మైదానానికి చేరుకున్నాయి.
వర్షం తగ్గడం.. అనుకున్న సమయానికి మ్యాచ్ జరుగుతుండటంతో వైజాగ్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. టికెట్లు ఉన్నవాళ్లను స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నగరంలోని హనుమంతవాక ,కార్ షెడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
వైజాగ్లో గత రెండు రోజులతో పాటు ఆదివారం కూడా వర్షం కురవడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహం నెలకొంది. ఎట్టకేలకు ఉదయం 11.30 గంటల నుంచి వర్షం నిలిచిపోయి ఎండ రావడంతో మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్