250 దాటిన ఆస్ట్రేలియా

టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ టిమ్‌పైన్(23*), గ్రీన్‌(20*) నిలకడగా ఆడుతున్నారు...

Updated : 15 Jan 2021 12:41 IST

గబ్బా: టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ టిమ్‌పైన్(23*), గ్రీన్‌(20*) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు లబుషేన్‌(108*) జట్టు స్కోర్‌ 213 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 82 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌ను 251/5కి చేర్చారు. భారత బౌలర్లలో ఇప్పటివకు నటరాజన్‌ 2 వికెట్లు తీయగా సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకుర్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని