రహానె ఔట్‌.. టీమ్‌ఇండియా 144/4

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానె(37; 93 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో...

Published : 17 Jan 2021 07:17 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానె(37; 93 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో వేడ్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 144 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌ అగర్వాల్‌(25), రిషభ్‌ పంత్‌ ఉన్నారు. అంతకుముందు జట్టు స్కోర్‌ 105 వద్ద  సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా(25; 94 బంతుల్లో 2x4) హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 55 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 144/4గా నమోదైంది.  

ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్‌ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని