Rahul Dravid - VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ + రాహుల్ ద్రవిడ్ = 376
రాహుల్ ద్రవిడ్ - వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ఇండియాకు రెండు కళ్లలాంటి వారు. ఒకప్పుడు ఆటగాళ్లుగా అదరగొట్టిన వీరు ఇప్పుడు భారత క్రికెట్ను ముందుకు నడిపిస్తున్న రథసారథులు...
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయానికి 21 ఏళ్లు..
రాహుల్ ద్రవిడ్ - వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ఇండియాకు రెండు కళ్లలాంటి వారు. ఒకప్పుడు ఆటగాళ్లుగా అదరగొట్టిన వీరు.. ఇప్పుడు భారత క్రికెట్ను తమ అనుభవంతో ముందుకు నడిపిస్తున్నారు. ఒకరు హెడ్కోచ్గా పనిచేస్తుంటే.. మరొకరు జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా, ఈ దిగ్గజాలు సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆస్ట్రేలియాపై రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 2001లో ఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టీమ్ఇండియాను ఫాలోఆన్ నుంచి గట్టెక్కించడమే కాకుండా.. విజయతీరాలకు తీసుకెళ్లారు. ఆ విశిష్టమైన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి విశేషాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
ఆ మ్యాచ్కు ముందు ఏం జరిగింది..
టీమ్ఇండియా సాధించిన అతిగొప్ప విజయాల్లో నాటి కోల్కతా టెస్టు అన్నింటికన్నా ప్రధానమైంది. ఎందుకంటే ఆస్ట్రేలియా అప్పటికే వరుసగా 16 టెస్టులు గెలిచి దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. దీంతో ఈడెన్లోనూ టీమ్ఇండియాకు మరో ఓటమి తప్పదనే భావన అందరిలోనూ నెలకొంది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు అంతకుముందే వరుసగా ఆరు టెస్టులు కోల్పోయింది. పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యాక టీమ్ఇండియా ఫాలోఆన్లో పడటంతో మరో ఘోర పరాభవం తప్పదనుకున్నారు. అలాంటి స్థితిలో లక్ష్మణ్, ద్రవిడ్ రికార్డు భాగస్వామ్యానికి తోడు చివరిరోజు హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ మాయాజాలంతో జట్టును గెలిపించారు.
ఆస్ట్రేలియా దంచికొట్టి.. భారత్ను కట్టడి చేసి..
మూడు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా అప్పటికే ముంబయిలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించింది. ఇక కోల్కతాలో జరిగిన రెండో టెస్టులోనూ అదృష్టం కలిసివచ్చి టాస్ గెలిచిన ఆ జట్టు కెప్టెన్ స్టీవ్వా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్ ఆర్డర్లో మాథ్యూ హేడెన్ (97), జస్టిన్ లాంగర్ (58), స్టీవ్వా (110) రాణించడంతో ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమ్ఇండియా 171 పరుగులకే కుప్పకూలింది. లక్ష్మణ్ (59) టాప్ స్కోరర్. దీంతో 274 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 657/7 స్కోర్ సాధించి చివరిరోజు ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఇక 383 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆసీస్ 212 పరుగులకు ఆలౌటైంది. భారత్ 171 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
లక్ష్మణ్ + ద్రవిడ్ = 376
అయితే, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా గెలవడానికి ప్రధాన కారణం లక్ష్మణ్ (281; 452 బంతుల్లో 44x4), ద్రవిడ్ (180; 353 బంతుల్లో 20x4) బ్యాటింగే. రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా మూడో రోజు 232 పరుగుల వద్ద గంగూలీ (48) వికెట్ కోల్పోయాక వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ఆరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 254/4 స్కోర్ సాధించగా.. ఇక నాలుగో రోజు ఆటలో వీరు మరింత రెచ్చిపోయారు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. ఒక్క వికెట్ కూడా పడనీయకుండా జాగ్రత్తగా ఆడారు. చివరికి ద్రవిడ్ 155, లక్ష్మణ్ 275 పరుగులతో నాలుగో రోజు ఆట ముగించారు. ఈ క్రమంలోనే ఐదో రోజు.. లక్ష్మణ్ 281, ద్రవిడ్ 180 పరుగులు సాధించాక ఔటయ్యారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత భారత్ 657/7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై భారత బౌలర్లు చెలరేగి ఆసీస్ను 212కే కట్టడి చేశారు. చివరి సెషన్లో హర్భజన్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్