మూడో టెస్టు: అరగంట ముందే భోజన విరామం

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామ సమయాన్ని అరగంట ముందుగా తీసుకున్నారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్‌ 21/1గా నమోదైంది...

Updated : 07 Jan 2021 07:25 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామ సమయాన్ని అరగంట ముందుగా తీసుకున్నారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్‌ 21/1గా నమోదైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బోల్తాకొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వార్నర్‌ వేటాడడంతో పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు 6 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం విల్‌ పకోస్కీ(14)తో కలిసి మార్నస్‌ లబుషేన్‌(2) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేశారు. అదే సమయంలో వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్‌ చేయగా, సిరాజ్‌ 3.1 ఓవర్లలో ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇవీ చదవండి..

చాలా బాధగా ఉంది: రాహుల్‌

ఇక షటిల్‌ సందడి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని