WTC Final: చెలరేగిన ట్రావిస్ హెడ్, స్మిత్.. తొలి రోజు ఆధిపత్యం ఆసీస్దే
టీమ్ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మొదటి రోజు ఆసీస్దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
లండన్: టీమ్ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మొదటి రోజు ఆసీస్దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146*; 156 బంతుల్లో) సెంచరీ బాదాడు. స్టీవ్ స్మిత్ (95*) శతకానికి చేరువయ్యాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) డకౌట్గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (43; 60 బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. మార్నస్ లబుషేన్ (26) పరుగులు చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు శుభారంభం దక్కలేదు. సిరాజ్ వేసిన 3.4 ఓవర్కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ వార్నర్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. లబుషేన్ నెమ్మదిగా ఆడినా.. వార్నర్ నిలకడగా బౌండరీలు బాదాడు. ఉమేశ్ వేసిన 15వ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. వార్నర్ దూకుడుకు శార్దూల్ అడ్డుకట్ట వేశాడు. ఠాకూర్ వేసిన 21.4 ఓవర్కు వార్నర్ కేఎస్ భరత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లంచ్ నుంచి రాగానే మంచి టచ్ మీద కనిపిస్తున్న లబుషేన్ను షమి బౌల్డ్ చేశాడు.
ఆదుకున్న హెడ్, స్మిత్
76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను ట్రావిస్ హెడ్, స్మిత్ ఆదుకున్నారు. ఆరంభంలో స్మిత్ చాలా నెమ్మదిగా ఆడినా.. హెడ్ క్రీజులోకి రావడంతోనే దూకుడుగా ఆడాడు. నిలకడగా బౌండరీలు బాదాడు. 60 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న హెడ్ .. తర్వాత సైతం అదే దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి ఆసీస్ 170/3తో నిలిచింది. చివరి సెషన్లో ఆరంభంలోనూ నెమ్మదిగా ఆడిన స్మిత్ తర్వాత దూకుడు పెంచాడు. షమి వేసిన 59వ ఓవర్లో హెడ్ వరుసగా ఫోర్, సిక్స్ బాదగా.. ఉమేశ్ యాదవ్ వేసిన తర్వాతి ఓవర్లో స్మిత్ రెండు ఫోర్లు కొట్టాడు. సిరాజ్ వేసిన 62 ఓవర్లో స్మిత్ అర్ధ శతకం (144 బంతుల్లో) అందుకున్నాడు. షమి వేసిన 65వ ఓవర్లో హెడ్ సెంచరీ (106 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం చేసిన తర్వాత స్టీవ్ స్మిత్ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన 66వ ఓవర్లో చివరి బంతిని బౌండరీకి పంపిన అతడు.. శార్దూల్ వేసిన 68 ఓవర్లోనూ ఓ ఫోర్ బాదాడు. జడేజా వేసిన 69వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి నిలకడగా బౌండరీలు సాధించడంతో స్కోరు 300 దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా