IND Vs BAN: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ ‘వంద’ కొట్టాలి.. బంగ్లా ‘ఆరు’ తీయాలి
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
మిర్పూర్: లక్ష్యం చిన్నదైనా బంగ్లాదేశ్ స్పిన్నర్లు హడలెత్తించారు. మ్యాచ్ను అంత సులువుగా ఇవ్వబోమని హెచ్చరికలు జారీ చేసినట్లు టపటపా భారత వికెట్లను పడగొట్టారు. బంగ్లా స్పిన్నర్ల దెబ్బకు టీమ్ఇండియా టాప్ ఆర్డర్ కకావికలమైంది. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 23 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో సరిగ్గా వంద పరుగులు చేస్తే భారత్దే విజయం. అలాగే బంగ్లాకు ఆరు వికెట్లు కావాలి. ప్రస్తుతం క్రీజ్లో అక్షర్ పటేల్ (26*), జయ్దేవ్ ఉనద్కత్ (3*) ఉన్నారు. ఇంకా బ్యాటింగ్కు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్తోపాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా రావాల్సి ఉంది.
బంగ్లాదేశ్ను రెండు ఇన్నింగ్స్ల్లోనూ తక్కువ పరుగులకే కట్టడి చేసి 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆనందం కాసేపే మిగిలింది. బంగ్లా బౌలర్ల దెబ్బకు మరోసారి కెప్టెన్ కేఎల్ రాహుల్ (2) ఘోరంగా విఫలం కాగా.. తొలి టెస్టులో రాణించిన శుబ్మన్ (7), ఛెతేశ్వర్ పుజారా (2) అనవసరంగా స్టంపౌట్ అయి పెవిలియన్కు చేరారు. ఎంతో ఏకాగ్రతతో ఆడిన విరాట్ కోహ్లీ (22 బంతుల్లో 1) దురదృష్టం కొద్దీ బ్యాట్ను తాకిన బంతి ప్యాడ్కు టచ్ అయి బంగ్లా ఫీల్డర్ మోమిన్ చేతిలో పడింది. దీంతో స్వల్ప వ్యవధిలోనే భారత్ నాలుగు వికెట్లను చేజార్చుకొంది. బంగ్లా బౌలర్లు మెహిదీ హసన్ 3, షకిబ్ ఒక వికెట్ తీశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ - 227/10.. భారత్ మొదటి ఇన్నింగ్స్- 314/10.. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 231/10.
పెవిలియన్కు విరాట్..
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబాటుకు గురవుతూ వికెట్లను సమర్పించుకొంటున్నారు. తాజాగా కీలక వికెట్ను కోల్పోయింది. నెమ్మదిగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (1) విఫలమై పెవిలియన్కు చేరాడు. మెహిదీ బౌలింగ్లో షార్ట్ లెగ్లో మోమినల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఇంకా భారత్ విజయానికి 107 పరుగులు కావాలి.
కట్టుదిట్టంగా బౌలింగ్..
బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. దీంతో స్వల్ప వ్యవధిలో టీమ్ఇండియా మూడో వికెట్ను నష్టపోయింది. మెహిదీ హసన్ వేసిన (13.2వ ఓవర్) బంతిని ఆడబోయి శుబ్మన్ గిల్ (7) స్టంపౌట్గా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజ్లో అక్షర్ పటేల్ (16*), విరాట్ కోహ్లీ (1*) ఉన్నారు. ఇంకా భారత్ విజయానికి 113 పరుగులు అవసరం.
పుజారా కూడా..
భారత్కు రెండో ఎదురు దెబ్బ. తొలి టెస్టులో నిలకడగా ఆడిన ఛెతేశ్వర్ పుజారా (6) వికెట్ను టీమ్ఇండియా చేజార్చుకొంది. మెహిదీ హసన్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన పుజారా స్టంపౌట్గా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. క్రీజ్లో గిల్ (4*), అక్షర్ పటేల్ ఉన్నారు. టీమ్ఇండియా విజయానికి ఇంకా 133 పరుగులు అవసరం. మూడో రోజు ఆటలో ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
రాహుల్ ఔట్
145 పరుగుల లక్ష్యంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకీబ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్(2).. నురుల్ హసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. క్రీజులో గిల్(1), పుజారా(1) ఉన్నారు.
ముగిసిన బంగ్లా రెండో ఇన్నింగ్స్..
మిర్పూర్: బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఎదుట 145 పరుగులను మాత్రమే విజయలక్ష్యంగా నిర్దేశించింది. లిటన్ దాస్ (73), జకీర్ హసన్ (51) అర్ధశతకాలు సాధించారు. ఇక చివర్లో నురుల్ హసన్ (31), తస్కిన్ అహ్మద్ (31*) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, రవిచంద్రన్ అశ్విన్ 2, మహమ్మద్ సిరాజ్ 2.. ఉమేశ్, జయ్దేవ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 314 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ను 227 పరుగులకే కట్టడి చేయడంతో భారత్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది.
దూకుడుకు కళ్లెం..
దూకుడుగా ఆడిన బంగ్లాకు భారత బౌలర్లు కళ్లెం వేశారు. నిలకడగా ఆడిన లిటన్ దాస్ను (73) భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 66.1వ ఓవర్లో 219 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ను కోల్పోయింది. తస్కిన్ అహ్మద్ (24*)తో కలిసి నిర్మించిన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజ్లోకి వచ్చిన తైజుల్ (1)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. ప్రస్తుతం 68 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. క్రీజ్లో తస్కిన్తోపాటు ఖలిద్ (4*) ఉన్నాడు. బంగ్లాదేశ్ ఆధిక్యం 137 పరుగులకు చేరింది.
దూకుడుగా బ్యాటింగ్..
బంగ్లా బ్యాటర్లు లిటన్ దాస్ (71*), తస్కిన్ అహ్మద్ (23*) అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు పరీక్ష పెడుతున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 57 పరుగులను జోడించారు. దీంతో జట్టును స్కోరును 200 పరుగులను దాటించారు. ప్రస్తుతం 65 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ఆధిక్యం 129 పరుగులకు చేరింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీయకపోతే బంగ్లా ఆధిక్యం భారీగా పెరిగే అవకాశం ఉంది.
టీ బ్రేక్..
రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో రెండో సెషన్ ముగిసింది. భారత బౌలర్ల దెబ్బకు కీలకమైన జకీర్ హసన్ (51)తోపాటు మెహిదీ హసన్ (0), నురుల్ హసన్ (31) పెవిలియన్కు చేరారు. వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన నురుల్ దూకుడుగా ఆడాడు. లిటన్ దాస్ (58*)తో కలిసి 46 పరుగులను జోడించాడు. అయితే అక్షర్ పటేల్ వేసిన (53.3వ ఓవర్) బంతిని ఆడబోయిన నురుల్ స్టంప్ ఔట్గా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం టీ బ్రేక్ సమయానికి 60 ఓవర్లలో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజ్లో లిటన్దాస్తోపాటు తస్కిన్ (5*) ఉన్నాడు. ఈ క్రమంలో లిటన్ అర్ధశతకం పూర్తి చేశాడు. వీరిద్దరూ వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బంగ్లా ఆధిక్యంలో వంద పరుగుల (108) మార్క్ను దాటింది.
జకీర్ ఔట్
ఓ వైపు వికెట్లు పడినా ఎంతో ఓపికగా ఆడి అర్ధశతకం సాధించిన బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్ (51) ఎట్టకేలకు పెవిలియన్కు చేరాడు. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని కొట్టే క్రమంలో బౌండరీ లైన్ వద్ద సిరాజ్ చేతికి చిక్కాడు. దీంతో 42.4 ఓవర్లలో 102 పరుగుల వద్ద బంగ్లా ఐదో వికెట్ను కోల్పోయింది. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా తన రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజ్లో మెహిదీ హసన్ మిరాజ్ (1*), లిటన్ దాస్ (16*) ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా 15 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఒకే సెషన్లో నాలుగు..
చివరి టెస్టులో బంగ్లాను రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. మూడో రోజు తొలి సెషన్లోనే బంగ్లా నాలుగు వికెట్లను కూల్చారు. అశ్విన్, ఉనద్కత్, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. బంగ్లా బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఓపెనర్గా వచ్చిన హసన్ ఒక్కడే టీమ్ఇండియా బౌలర్లను ఎదుర్కొని ఆడుతున్నాడు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి.. బంగ్లా స్కోరు 71/4 (33). క్రీజులో హసన్(37) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంకా బంగ్లా 16 పరుగుల వెనకంజలో ఉంది.
బంగ్లాను కట్టడి చేస్తున్న భారత బౌలర్లు
చివరి టెస్టు మూడో రోజు ఆటలో బంగ్లాను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. తొలి సెషన్లో ఇప్పటి వరకూ 3 వికెట్లు పడగొట్టారు. అశ్విన్, ఉనద్కత్, సిరాజ్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(7), జాకీర్ హసన్ (32) ఉన్నారు. బంగ్లా ఇంకా 23 పరుగుల వెనకంజలో ఉంది.
ఆదిలోనే రెండు వికెట్లు..
భారత్-బంగ్లా మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 7/0 ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన బంగ్లా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ బౌలింగ్లో షాంటో(5) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక సిరాజ్ వేసిన 13వ ఓవర్లో మొమినుల్ హక్(5) పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 18 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులతో ఆడుతోంది. క్రీజులో జాకీర్ హసన్(18), షకీబ్(10) ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 48 పరుగుల వెనకంజలో ఉంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు చేసింది. పంత్, శ్రేయస్ల కీలక భాగస్వామ్యాలతో జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. వీళ్లిద్దరూ అయిదో వికెట్కు 159 పరుగులు జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి