IND vs ENG: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ బ్యాటింగ్‌

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గతేడాది కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్‌ ఎట్టకేలకు జరగనుంది...

Published : 01 Jul 2022 14:52 IST


Source: బీసీసీఐ ట్విటర్‌

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్‌ ఎట్టకేలకు జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా కారణంగా దూరమవ్వగా పేసర్‌ బుమ్రా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో నిలిచిన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌ను కూడా గెలుపొంది 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని