IND vs ENG: టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 245 ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 378
టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు మొత్తం 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది...
బర్మింగ్హామ్: టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు మొత్తం 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెన్స్టోక్స్ వేసిన 82వ ఓవర్లో బుమ్రా(7) నాలుగో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. అయితే, ఐదో బంతిని కూడా స్టాండ్స్లోకి తరలించాలని చూసి గాల్లోకి షాట్ ఆడాడు. కానీ, క్రాలే పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్కు తెరపడింది. అంతకుముందు 80వ ఓవర్లో జడేజా (27) స్టోక్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. సిరాజ్ (2) నాటౌట్గా నిలిచాడు. కాగా, టీమ్ఇండియా నాలుగో రోజు 125/3 ఓవర్నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించింది. పుజారా (66), పంత్ (57) అర్ధశతకాలతో రాణించారు. అయితే, శ్రేయస్ అయ్యర్ (19), జడేజా (27) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 4 వికెట్లు తీయగా, పాట్స్, బ్రాడ్ చెరో 2 వికెట్లు తీశారు. అండర్సన్, లీచ్ చెరో వికెట్ పడగొట్టారు.
బర్మింగ్హామ్: రెండో సెషన్ ప్రారంభమైంది. అయితే, భోజన విరామం తర్వాత స్టోక్స్ వేసిన తొలి ఓవర్లోనే షమి (13) ఔటయ్యాడు. అతడు ఆడిన షాట్ను లీస్ క్యాచ్ అందుకోవడంతో టీమ్ఇండియా 230 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా (19), బుమ్రా(0) ఉన్నారు. దీంతో 75 ఓవర్లకు జట్టు స్కోర్ 231/8గా నమోదైంది. ప్రస్తుతం ఆధిక్యం 363 పరుగులకు చేరింది.
బర్మింగ్హామ్: నాలుగో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయింది. మొత్తం 28 ఓవర్ల ఆట జరగ్గా టీమ్ఇండియా ఓవర్ నైట్ స్కోర్ 125/3కి మరో 104 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. పుజారా (66), పంత్ (57) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, శ్రేయస్ అయ్యర్ (19) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం జడేజా (17), షమి (13) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో భోజన విరామ సమయానికి టీమ్ఇండియా 73 ఓవర్లకు 229/7తో నిలిచింది. ఇప్పుడు మొత్తం ఆధిక్యం 361 పరుగులకు చేరింది.
బర్మింగ్హామ్: టీమ్ఇండియా ఏడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ (4) ఔటయ్యాడు. పాట్స్ వేసిన 69.1 ఓవర్కు ఫ్లిక్ షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద ఓలీ పోప్ చేతికి చిక్కాడు. దీంతో టీమ్ఇండియా 207 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. మరోవైపు క్రీజులో జడేజా(11), షమి(4) ఉన్నారు. దీంతో 70 ఓవర్లకు జట్టు స్కోర్ 212/7గా నమోదైంది. మొత్తం ఆధిక్యం 344 పరుగులకు చేరింది.
బర్మింగ్హామ్: టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. శ్రేయస్ (19) ఔటైన కాసేపటికే పంత్ (57) కూడా పెవిలియన్ చేరాడు. జాక్ లీచ్ బౌలింగ్లో అతడు రివర్స్స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల వెనకాల జోరూట్ చేతికి చిక్కాడు. దీంతో టీమ్ఇండియా 198 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జడేజా(5), శార్దూల్ ఠాకూర్ (0) క్రీజులో ఉన్నారు. 64 ఓవర్ల తర్వాత మొత్తం ఆధిక్యం 331 పరుగులకు చేరింది.
బర్మింగ్హామ్: టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో ఐదో వికెట్ కోల్పోయింది. పాట్స్ వేసిన 59.2 ఓవర్కు శ్రేయస్ అయ్యర్ (19) ఔటయ్యాడు. అతడు పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిడ్వికెట్లో అండర్సన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 190 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మరోవైపు రిషభ్ పంత్ (53) హాఫ్ సెంచరీతో కొనసాగుతున్నాడు. బ్రాడ్ వేసిన 58.3 ఓవర్కు అతడు బౌండరీ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. దీంతో 60 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 194/5గా నమోదైంది. దీంతో మొత్తం ఆధిక్యం 326 పరుగులకు చేరింది.
బర్మింగ్హామ్: టీమ్ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్టువర్ట్బ్రాడ్ వేసిన 52.3 ఓవర్కు పుజారా (66) ఔటయ్యాడు. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ను అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లీస్ క్యాచ్ అందుకోవడంతో టీమ్ఇండియా 153 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పంత్ (43), శ్రేయస్ అయ్యర్ (2) ఉన్నారు. ఈ క్రమంలోనే 54 ఓవర్లకు జట్టు స్కోర్ 159/4గా నమోదైంది. మొత్తం ఆధిక్య 291 పరుగులకు చేరింది.
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. పంత్(37), పుజారా (61) రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 50 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్ఇండియా స్కోర్ 146/3గా నమోదైంది. దీంతో టీమ్ఇండియా ఆధిక్యం మొత్తం 278కి చేరింది. మరోవైపు బర్మింగ్హామ్లో ఈరోజు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో మొత్తం 98 ఓవర్ల పాటు ఆట జరిగే వీలుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కనీసం రెండు సెషన్లు ఆడి మంచి స్కోర్ సాధించి చివరి సెషన్లో ఇంగ్లాండ్కు బ్యాటింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM