IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆటముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో భారత్ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆటముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో భారత్ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో పుజారా (50 నాటౌట్: 139 బంతుల్లో), పంత్ (30 నాటౌట్: 46 బంతుల్లో) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ నాలుగు పరుగుల వద్ద శుభ్మన్ గిల్(4) వికెట్ను కోల్పోయింది. దీంతో విహారితో కలిసి మరో ఓపెనర్ పుజారా నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 43 పరుగుల వద్ద విహారి(11) బ్రాడ్కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి కోహ్లీ వచ్చాడు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ 75 పరుగుల వద్ద కోహ్లీ(20) స్టోక్స్ బౌలింగ్లో రూట్కు దొరికిపోయాడు. మరోవైపు క్రీజులో నిలుదొక్కుకున్న పుజారా తర్వాత వచ్చిన పంత్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో పుజారా అర్ధశతకం నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి ఇలాగే ఆడితే నాలుగోరోజు భారత్కు భారీ స్కోర్ చేసే అవకాశం లభిస్తుంది.
నిరాశ పరిచిన కోహ్లీ..
విరాట్ కోహ్లీ (20; 40 బంతుల్లో 4x4) మరోసారి నిరాశపర్చాడు. టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో బెన్స్టోక్స్ వేసిన 29.5 ఓవర్కు కీపర్కు క్యాచ్ ఇవ్వగా అది చేజారింది. అయితే, పక్కనే ఉన్న జోరూట్ ఆ బంతిని అందుకోవడంతో విరాట్ వెనుదిరగక తప్పలేదు. దీంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 30 ఓవర్లకు జట్టు స్కోర్ 76/3గా నమోదైంది. క్రీజులో పుజారా (33), రిషభ్ పంత్ (1) ఉన్నారు. మొత్తం ఆధిక్యం 208 పరుగులకు చేరింది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఆధిక్యం 200 దాటింది. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. ప్రస్తుతం 25 ఓవర్లకు 68/2తో కొనసాగుతోంది. క్రీజులో పుజారా(32), కోహ్లీ (15) ఉన్నారు. వీరిద్దరూ 25 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు అండర్సన్ వేసిన తొలి ఓవర్లోనే శుభ్మన్గిల్ (4) గిల్ ఔటయ్యాడు. ఆపై విహారి, పుజారా నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను పూర్తి చేశారు. అయితే, టీ విరామం అనంతరం మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే స్టువర్ట్బ్రాడ్ వేసిన 17వ ఓవర్లో విహారి (11) ఔటయ్యాడు. దీంతో టీమ్ఇండియా 43 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. అనంతరం పుజారా, కోహ్లీ నిలకడగా ఆడుతున్నారు.
టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడుతోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్గిల్(4) వికెట్ కోల్పోయినా.. పుజారా (17), హనుమ విహారి (10) ఆచితూచి ఆడుతున్నారు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బంతికే గిల్ స్లిప్లో దొరికిపోయి ఔటయ్యాడు. దీంతో టీమ్ఇండియా 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న విహారి, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మూడో రోజు రెండో సెషన్ను పూర్తి చేశారు. దీంతో 13 ఓవర్లకు జట్టు స్కోర్ 37/1గా నమోదైంది. మొత్తం ఆధిక్యం 169 పరుగులకు చేరింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. ఆ జట్టు 284 పరుగులకు ఆలౌటైంది. జానీ బెయిర్ స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6) శతకంతో మెరిసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడికి కెప్టెన్ బెన్స్టోక్స్ (25), సామ్ బిల్లింగ్స్ (36) చక్కటి సహకారం అందించారు. ఈ క్రమంలోనే వారిద్దరితో బెయిర్స్టో ఆరు, ఏడు వికెట్లకు 66, 92 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో మాటీ పాట్స్ (19) వేగంగా పరుగులు రాబట్టాడు.
కాగా, 84/5తో ఆదివారం మూడోరోజు ఆట కొనసాగించిన బెయిర్స్టో, బెన్స్టోక్స్ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ తొలుత నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే, శార్దూల్ వేసిన 38వ ఓవర్లో స్టోక్స్ బౌండరీ కొట్టబోయి.. బుమ్రా చేతికి చిక్కాడు. తర్వాత బెయిర్స్టో.. బిల్లింగ్స్తో కలిసి ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే శతకం పూర్తి చేసుకున్నాక షమి బౌలింగ్లో స్లిప్లో కోహ్లీ చేతికి చిక్కాడు. దీంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. తర్వాత బిల్లింగ్స్, మాటీ పాట్స్ పలు బౌండరీలు బాది జట్టు స్కోర్ను 284 పరుగులకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3, షమి 2, శార్దూల్ 1 వికెట్ తీశారు. ఇక టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 132 పరుగులుగా నమోదైంది.
ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత షమి వేసిన 55వ ఓవర్లో శతక వీరుడు జానీ బెయిర్ స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6) ఔటయ్యాడు. అతడు స్లిప్లో విరాట్ కోహ్లీ చేతికి చిక్కడంతో ఇంగ్లాండ్ 241 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అనంతరం సిరాజ్ వేసిన 56వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ (1) గాల్లోకి షాట్ ఆడగా కీపర్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 248 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సామ్ బిల్లింగ్స్ (28), పాట్స్ (0) క్రీజులో ఉన్నారు. 56 ఓవర్లకు ఇంగ్లాండ్ 250/8 స్కోర్తో నిలిచింది.
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ జానీ బెయిర్ స్టో (100; 119 బంతుల్లో 14x4, 2x6) శతకం బాదాడు. తొలుత వికెట్ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడిన అతడు తర్వాత రెచ్చిపోతున్నాడు. 83/5తో కష్టాల్లో పడిన జట్టుని ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ బెన్స్టోక్స్ (25)తో కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించిన అతడు తర్వాత సామ్ బిల్లింగ్స్(20)తో కలిసి మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలోనే శార్దూల్ వేసిన 48వ ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 227/6గా నమోదైంది. ప్రస్తుతం వీరిద్దరూ 65 బంతుల్లో 77 పరుగులు చేసి వేగంగా ఆడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు