IND vs ENG: సిరీస్‌ గెలిచాక మనోళ్ల జోరు చుశారా..!

ఇంగ్లాండ్‌తో మాంచెష్టర్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి, 2-1 తేడాతో  వన్డే సిరీస్‌ కైవసం చేసుకొంది. అయితే, ఆ మ్యాచ్‌లో

Updated : 18 Jul 2022 10:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో మాంచెష్టర్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి.. 2-1 తేడాతో  వన్డే సిరీస్‌ కైవసం చేసుకొంది. అయితే.. ఈ మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 72 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ పాండ్య (71), రిషబ్‌పంత్‌ (125 నాటౌట్‌) పోరాటంతో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మ్యాచ్‌ అనంతరం భారత ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాదించారు.

జట్టు ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చే ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శిఖర్ ధావన్ షాంపైన్ బాటిల్‌ తెరిచి రోహిత్‌పై స్ర్పే చేశాడు. దీంతో మిగిలిన ఆటగాళ్లు ధావన్‌కు దూరంగా పరిగెత్తారు. రోహిత్ కూడా ధావన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఉల్లాసంగా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ బ్యాక్‌గ్రౌండ్‌ ఫ్రేమ్‌లోకి ప్రవేశించడం కెమెరాకు చిక్కింది. గ్రూప్‌ ఫొటో దిగుదాం రండి అని కెప్టెన్‌ రోహిత్‌ మిగిలిన ఆటగాళ్లను కోరాడు. కానీ పంత్‌ తగ్గలేదు.. మళ్లీ షాంపైన్‌ బాటిల్‌ తీసుకొచ్చి రోహిత్‌పై చల్లాడు. చివరకు అంతా కలసి ట్రోఫిని యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు అందించి, సంబరాలు చేసుకొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని