IND vs ENG: మూడో రోజూ వర్షంతో ఆటకు అంతరాయం..
టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న ఐదో టెస్టులో మూడో రోజు కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు...
బర్మింగ్హామ్: టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న ఐదో టెస్టులో మూడో రోజు కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 45.3 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ జానీ బెయిర్ స్టో (91; 113 బంతుల్లో 12x4, 2x6) శతకానికి చేరువయ్యాడు. మరోవైపు సామ్ బిల్లింగ్స్(7) అతడికి తోడుగా ఉన్నాడు. వీరిద్దరూ 49 బంతుల్లో 51 పరుగులు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 200/6కి చేరింది. టీమ్ఇండియా కన్నా ఇంకా 216 పరుగులు వెనుకంజలో నిలిచింది. ఈ క్రమంలోనే అంపైర్లు భోజన విరామం ప్రకటించారు.
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ (25; 36 బంతుల్లో 4x4) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో బౌండరీ షాట్ కొట్టబోయి బుమ్రా చేతికి చిక్కాడు. దూరంగా వెళ్తున్న బంతిని బుమ్రా అమాంతం డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 149 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మరోవైపు బెయిర్ స్టో (50) గత ఓవర్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడు సామ్ బిల్లింగ్స్ క్రీజులోకి వచ్చాడు. 38 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 153/6గా నమోదైంది.
బర్మింగ్హామ్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 84/5 ఓవర్ నైట్ స్కోర్తో ఆదివారం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో(31), కెప్టెన్ బెన్ స్టోక్స్(17) తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ వారిని ఔట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 34 ఓవర్లకు 121/5 స్కోర్తో నిలిచింది. అయితే, వీరిద్దర్నీ త్వరగా ఔట్ చేస్తే టీమ్ఇండియాకు కలిసొచ్చే అవకాశం ఉంది. అంతకుముందు శనివారం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టును కెప్టెన్ బుమ్రా దెబ్బ తీశాడు. టాప్ ఆర్డర్లోని అలెక్స్ లీస్ (6), జాక్ క్రాలే (9), ఓలీపోప్ (10)లను 44 పరుగులకే పెవిలియన్కు పంపాడు. చివర్లో సిరాజ్ ప్రమాదకారి జోరూట్ (31)ను, షమి జాక్ లీచ్(0)ను ఔట్ చేశారు. స్టోక్స్, బెయిర్స్టో ప్రస్తుతం 38 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!