Ind vs Eng: జోడీ కుదిరింది.. టాప్ లేపింది!
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1 తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, మాంచెష్టర్ వేదిక
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1 తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, మాంచెష్టర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ను భారత బౌలర్లు ఆరంభంలోనే కట్టడిచేశారు. దీంట్లో విరాట్కోహ్లీ పాత్రకూడా ఉంది. విరాట్ బౌలింగ్ చేయకపోయినా చిట్కాలను సిరాజ్కిచ్చి ఫలితం రాబట్టాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్ మూడోబంతిని బెయిర్స్టో లెగ్సైడ్ ఆడదామనుకొన్నా, బంతిని అంచనా వేయలేక మిడ్ఆఫ్లోఉన్న ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరవాత జో రూట్ క్రీజ్లోకి వచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ..సిరాజ్తో మాట్లాడి సలహాలు ఇస్తున్నాట్లు కనిపించాడు. అదే ఓవర్ చివరి బంతిని సిరాజ్ స్వింగ్ చేస్తూ ఆఫ్ స్టంఫ్ మీదుగా సంధించాడు. అయితే, బ్యాటర్ రూట్ బంతిని అడ్డుకునే ప్రయత్నంలో రెండో స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. దీంతో ఒకే ఓవర్లలో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లను పెవిలియన్ కు పంపి సిరాజ్ టీమ్ఇండియాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రూట్ ఔట్ అయిన వెంటనే కోహ్లీ వైపు చూస్తూ సిరాజ్ ఎగిరిగంతెయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మ్యాచ్కు బుమ్రా స్థానంలో వచ్చిన సిరాజ్ పవర్ ప్లేలో ఇద్దరు కీలక బ్యాటర్లను డకౌట్ చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.