IND vs ENG: ఇంగ్లాండ్తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..
ఇంగ్లాండ్తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్ఇండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం...
ఇంగ్లాండ్తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్ఇండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి.. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1గా మార్చి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో ఇంగ్లిష్ గడ్డపైనా చారిత్రక విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, అదంత తేలికేం కాదు.. ఇప్పటికే బ్యాటింగ్లో ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమవడం.. కెప్టెన్ రోహిత్ కరోనా బారినపడటం.. కోహ్లీ, పూజారాల ఫామ్లపై అనుమానాలు.. ఇవన్నీ చూస్తుంటే బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ గతవారమే న్యూజిలాండ్పై టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసిన నేపథ్యంలో.. టీమ్ఇండియా ఆశలన్నీ ఇప్పుడు బౌలింగ్ దళంపైనే ఆధారపడ్డాయి.
ఇంగ్లిష్ బ్యాటర్లను చుట్టేస్తారా?
గతేడాది ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో నాలుగు ఆటలు పూర్తయ్యేసరికి భారత్ ఒక మ్యాచ్ డ్రా చేసుకొని 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే, గతంలో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టును ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. అప్పుడు భారత బౌలర్ల విజృంభించడంతో లార్డ్స్, ఓవల్ మ్యాచ్లను సొంతం చేసుకుంది. ఇక్కడ ప్రధాన పేసర్లు.. జస్ప్రిత్ బుమ్రా 4 మ్యాచ్ల్లో 18, మహ్మద్ సిరాజ్ 4 మ్యాచ్ల్లో 14, మహ్మద్ షమి 3 మ్యాచ్ల్లో 14, శార్దూల్ ఠాకూర్ 2 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన ఆరంభ టెస్టులో తొలిరోజు పేసర్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4, షమి 3, శార్దూల్ 2 వికెట్లతో రాణించారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఇంగ్లాండ్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అది కూడా చివరిరోజు ఆటలో 60 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్న కఠిన పరిస్థితుల్లో! కానీ, భారత బౌలర్లు మరోసారి కట్టుదిట్టంగా బంతులేసి ఇంగ్లాండ్ పని పట్టారు. కేవలం 51.5 ఓవర్లలోనే 120 పరుగులకు ఆలౌట్ చేశారు. సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీయడంతో టీమ్ఇండియా విజయం సాధించింది. చివరగా ఓవల్లో జరిగిన నాలుగో టెస్టులో 367 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను టీమ్ఇండియా 210 పరుగులకే పరిమితం చేసింది. ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2, జడేజా 2, శార్దూల్ 2 వికెట్లతో సమష్టిగా రాణించారు.
ఇంగ్లిష్ జట్టుపై భారత బౌలర్ల రికార్డు
శార్దూల్, అశ్విన్లలో ఎవరు?
అయితే, భారత్లో జరిగే మ్యాచ్లకు అశ్విన్ ప్రధాన స్పిన్నర్గా ఉంటాడనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇంగ్లాండ్ పిచ్లు పేస్కు అనుకూలం కాబట్టి.. గత సిరీస్లో టీమ్ఇండియా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ వ్యూహంతో బరిలోకి దిగింది. దీంతో జడేజాను తుది జట్టులోకి తీసుకొని.. బ్యాట్స్మన్, బౌలింగ్ సేవలను వినియోగించుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ అనే కాకుండా మిగతా విదేశీ సిరీస్ల్లోనూ టీమ్ఇండియా చాలా వరకు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. అవసరాన్ని బట్టి అశ్విన్ను ఆడిస్తుంది. కానీ, గతేడాది మాత్రం అతడి లాంటి కీలక స్పిన్నర్ను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసింది. అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టుకు తుది జట్టులో ఆడనిస్తారో లేదో చూడాలి. మరోవైపు బుమ్రా, సిరాజ్, షమి తుది జట్టులో ఉండొచ్చని తెలుస్తోంది. నాలుగో బౌలర్గా శార్దూల్, అశ్విన్లలో ఎవరికైనా అవకాశం ఇవ్వొచ్చు. పిచ్ పరిస్థితులను బట్టి ఆఖరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఎందుకంటే వీరిద్దరూ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సమర్థులే.
ఎడ్జ్బాస్టన్లో ఎవరు రాణించారంటే?
అయితే, 2018లో టీమ్ఇండియా చివరిసారి ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పుడు గెలవాల్సిన మ్యాచ్ను త్రుటిలో కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 287 పరుగులు చేయగా.. రూట్ (80), బెయిర్స్టో (70) అర్ధశతకాలతో రాణించారు. టీమ్ఇండియా బౌలర్లు అశ్విన్ 4, షమి 3 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశారు. ఇక టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 274 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్గా ఉన్న కోహ్లీ (149) ఒక్కడే రాణించాడు. సామ్ కరన్ 4, అండర్సన్ 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ 13 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 180 పరుగులకే కుప్పకూలగా.. ఇషాంత్ 5, అశ్విన్ 3, ఉమేశ్ 2 వికెట్లతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే, 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. స్టోక్స్ 4, బ్రాడ్ 2, అండర్సన్ 2 వికెట్ల ధాటికి 162 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ (51) ఒంటరిపోరాటం చేసినా 31 పరుగుల స్వల్ప తేడాతో భారత్ ఓటమిపాలైంది. అయితే, రేపటి నుంచి జరిగే కీలక టెస్టులో షమి, అశ్విన్ మరోసారి ఆడి.. చెలరేగితే ఇంగ్లాండ్ను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి తోడు బుమ్రా, సిరాజ్ కూడా రాణించాలని ఆశిద్దాం.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి