IND vs IRE: సంజూకి అవకాశమా.. త్రిపాఠికి అరంగేట్రమా..?
ఛాన్స్ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్లో యువ బ్యాట్స్మెన్లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన దీపక్ హుడా
ఐర్లాండ్తో నేడు రెండో టీ20..
క్లీన్ స్వీప్ లక్ష్యంగా యువ భారత్
ఇంటర్నెట్ డెస్క్: ఛాన్స్ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్లో యువ బ్యాట్స్మెన్లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన దీపక్ హుడా...డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో చెలరేగి ఆడాడు. రుతురాజ్కు గాయం కావడంతో ఓపెనర్గా దిగిన హుడా...వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో టీ20లో ఎవరికి ఛాన్స్?
భారత టీ20 లీగ్లో రాణించి ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనా సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి ఇప్పుడు తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. తొలి టీ20లో రుతురాజ్కు పిక్క కండరాలు పట్టేయడంతో ఓపెనింగ్ చేయలేదు. దీంతో జట్టు యాజమాన్యం మిడిలార్డర్లో ఆడే హుడాను ఓపెనర్గా పంపించింది. అయితే రెండో టీ20కి రుతురాజ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలో ఒకరు ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు డబ్లిన్ వేదికగా రెండో టీ20జరగనుంది.
సంజూకి సపోర్ట్
శాంసన్కు ఇదివరకే టీమ్ఇండియాకు ఆడిన అనుభవం ఉంది. టాలెంట్ ఉన్నా.. నిలకడలేమి ,సరైన సమయంలో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో భారత జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్లో 17 మ్యాచ్ల్లో 146.79 స్ట్రెక్రేట్తో 458 పరుగులు సాధించాడు. దీంతో అతడు దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికవుతాడని అంతా భావించారు. అయితే మిడిలార్డర్లో పంత్, శ్రేయస్ ఉండటంతో సంజూకి అవకాశం రాలేదు. తాజాగా ఐర్లాండ్ సిరీస్ తొలి మ్యాచ్లో రిజర్వ్ బెంచ్కే పరిమితం అయ్యాడు. దీంతో రెండో టీ20లో అతడిని ఎలా అయినా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు సంజూ లాంటి మ్యాచ్విన్నర్లు జట్టులో ఉండాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు.
త్రిపాఠి అరంగేట్రం చేస్తాడా?
టీమ్ఇండియాకు తొలిసారి ఎంపికైనా రాహుల్ త్రిపాఠి అరంగేట్ర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్నేళ్లుగా భారత టీ20 లీగ్లో రాణిస్తున్నాడు. ఈ ఏడాది హైదారాబాద్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుతమైన స్ట్రెక్రేట్ (158.24)తో 413 పరుగులు( 14 మ్యాచ్ల్లో) సాధించాడు. దీంతో సెలెకర్లు అతడిని ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేశారు. గత మ్యాచ్లో భారత టీ20 లీగ్లో హైదారాబాద్ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్లో కోచ్గా ఉన్న వీవీయస్ లక్ష్మణ్ త్రిపాఠికి కూడా అవకాశం కల్పిస్తాడని పలువురు అభిమానులు అంటున్నారు. భారత టీ20 లీగ్లో హైదారాబాద్ జట్టుకు లక్ష్మణ్ మెంటర్గా ఉన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ ఆడతారా?
సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలో ఒకరు రెండో టీ20లో ఆడే ఛాన్స్ ఎక్కువ. అయితే ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలంటే పెద్దగా రాణించని అక్షర్ పటేల్ని బెంచ్కి పరిమితం చేయాలి. ఐదో బౌలర్గా హార్దిక్, హుడా ఉండటంతో ఈ మార్పు చేయడానికి అవకాశం ఉంది. లేదంటే అక్షర్ స్థానంలో అర్ష్దీప్ని కూడా ఆడించొచ్చు. జట్టు కూర్పు పై కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ హార్దిక్దే తుది నిర్ణయం కాబట్టి ఎలాంటి మార్పులైనా జరగొచ్చు. ఏం చేస్తారో చుడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!