arshdeep: ఉమ్రాన్ ఓకే.. మరి అర్ష్దీప్ సంగతేంటి?
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో యువ భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ పేసర్ అర్ష్దీప్
(Photo: Arshdeep Singh Instagram)
ఇంటర్నెట్ డెస్క్: డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో యువ భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ని తుది జట్టులో ఆడించకపోవడంపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రస్తుత జట్టులో ఉన్న ఏకైక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అర్ష్దీప్ అని, అతడు డెత్ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లు వేయగలడని అంటున్నారు. డబ్లిన్ పిచ్పై అతడు బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇవ్వడంతో అర్ష్దీప్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు. అయితే, రెండో టీ20కైనా అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కాగా, అర్ష్దీప్ ఇటీవల పూర్తి అయిన భారత టీ20 లీగ్లో పంజాబ్ తరఫున 14 మ్యాచ్లు ఆడి 7.70 మేటి ఎకానమి నమోదు చేశాడు. దీంతో అతడిని దక్షిణాఫ్రికాతో పాటు, ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.