IND vs NZ: రెండో రోజు లంచ్‌ బ్రేక్‌.. పటిష్ఠ స్థితిలో టీమ్‌ఇండియా

టీమ్‌ఇండియా 258/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించగా తొలి సెషన్‌లో మరో 81 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భోజన విరామ సమయానికి 339/8తో నిలిచింది...

Updated : 26 Nov 2021 11:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా 258/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించగా తొలి సెషన్‌లో మరో 81 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భోజన విరామ సమయానికి 339/8తో నిలిచింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (38; 54 బంతుల్లో 5x4), ఉమేశ్‌ యాదవ్‌ (4; 28 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.  వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 26 పరుగులు జోడించి అజేయంగా కొనసాగుతున్నారు. అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) తొలి టెస్టులోనే శతకంతో చెలరేగాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌సౌథీ 5, జేమీసన్‌ 3 వికెట్లు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని