IND vs NZ: అదొక్కటే కాస్త నిరాశపర్చింది: రాహుల్ ద్రవిడ్
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా పరుగుల పరంగా అత్యంత భారీ విజయం సాధించడంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు...
టెస్టు సిరీస్ విజయంపై టీమ్ఇండియా కోచ్
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా పరుగుల పరంగా అత్యంత భారీ విజయం సాధించడంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే, కాన్పూర్ టెస్టులో విజయం అంచుల దాకా వెళ్లి పని పూర్తి చేయకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందని చెప్పాడు. మ్యాచ్ అనంతరం ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘సిరీస్ను విజయంతో ముగించడం బాగుంది. కానీ, కాన్పూర్లోనే ఆఖరి వికెట్ తీయలేకపోయాం. అదే కాస్త నిరాశకు గురిచేసింది. అయినా భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఆటగాళ్లకే ఆ క్రెడిటంతా దక్కుతుంది. కఠిన పరిస్థితుల నుంచి బాగా పుంజుకున్నారు. యువకులు బాగా ఆడారు. సీనియర్లు లేకున్నా తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. జయంత్ యాదవ్ ఆదివారం రాణించకపోయినా ఈరోజు ఉదయం నాలుగు వికెట్లతో మెరిశాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్, జయంత్లాంటి ఆటగాళ్లు ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడే అవకాశం రాదు. అయినా వారు ఇలా ఆడటం బాగుంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
‘అలాగే మేం రెండో ఇన్నింగ్స్లో తొలుత డిక్లేర్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఆటలో ఇంకా చాలా సమయం మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ను ఎలాగైనా ఆలౌట్ చేస్తామనే నమ్మకం ఉంది. ఇలాంటి ఎర్రమట్టి వికెట్పై బంతి బౌన్స్ అవుతున్న వేళ బ్యాటింగ్ చేయడం యువకులను మరింత మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతుంది’ అని రాహుల్ వివరించాడు. ఇక ఈ మ్యాచ్లో ఆడేటప్పుడు పలువురు ఆటగాళ్లు గాయపడ్డారని, అది కాస్త ఆందోళనకు గురిచేస్తోందని తెలిపాడు. ఫార్మాట్లకు అతీతంగా ఆటగాళ్లు చాలా మ్యాచ్లు ఆడుతున్న నేపథ్యంలో వాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అదే సమయంలో యువకులు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారని, దీంతో రాబోయే మ్యాచ్ల గురించి ఆలోచిస్తే.. ఎవరిని ఎలా ఆడించాలనేది తలనొప్పిగా ఉంటుందని ద్రవిడ్ సరదాగా అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.