IND vs NZ: వాంఖడే పిచ్ క్యూరేటర్కు టీమ్ఇండియా నగదు బహుమతి
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించిన అనంతరం జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్ క్యూరేటర్కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసింది...
ముంబయి: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించిన అనంతరం జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్ క్యూరేటర్కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సొంతంగా అక్కడి క్యూరేటర్కు ఇదే విధంగా నగదు బహుమతి అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ రెండో టెస్టులో పరుగుల పరంగా (372) అత్యంత భారీ విజయం అందుకున్న నేపథ్యంలో ఈ ప్రోత్సాహక బహుమతి అందజేసింది. సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే భారత జట్టు న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లు పడగొట్టి 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ నంబర్ 1 స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జట్టును వెనక్కి నెట్టింది. ప్రస్తుతం టీమ్ఇండియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా కివీస్ 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు వరుసగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం