IND vs NZ: శ్రేయస్ అయ్యర్ స్టాండ్ ఔట్ ఆటగాడు: వీవీఎస్
న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ‘స్టాండ్ ఔట్ ప్లేయర్’గా అభివర్ణించాడు...
ఇంటర్నెట్డెస్క్: న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ‘స్టాండ్ ఔట్ ప్లేయర్’గా అభివర్ణించాడు. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అయ్యర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు తొలి మ్యాచ్లోనే శతకం, అర్ధశతకం బాది.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. తాజాగా అతడి ఆటతీరును మెచ్చుకుంటూ లక్ష్మణ్ ఓ క్రీడాఛానెల్తో మాట్లాడాడు.
‘ఈ సిరీస్లో శ్రేయస్ స్టాండ్ ఔట్ ప్లేయర్గా నిలిచాడు. తన తొలి టెస్టులోనే ఒత్తిడిని జయిస్తూ రాణించిన తీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడిన క్లిష్టపరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన అతడు.. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని బ్యాటింగ్ చేశాడు. తర్వాత శతకం సాధించాడు. ఇక టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చాడు. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో శ్రేయస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అర్ధ శతకం సాధించాడు. దీంతో రెండు ఇన్నింగ్స్ల్లోనూ అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు’ అని లక్ష్మణ్ ప్రశంసించాడు.
సిరాజ్.. టీమ్ఇండియాకు గొప్ప ఆస్తి
అలాగే, హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ టీమ్ఇండియాకు గొప్ప ఆస్తి అని లక్ష్మణ్ అన్నాడు. ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ను సిరాజ్ కుప్పకూల్చిన విషయం తెలిసిందే. ‘రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశాడు. షార్ట్ పిచ్ బంతులతో కివీస్ టాప్ ఆర్డర్ని కుప్పకూల్చాడు. టెస్టు మ్యాచ్ బౌలర్గా గొప్ప పరిణతి సాధించాడు. టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక బౌలర్లు దూరమైన సమయంలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మెరుగ్గా రాణించాడు. అతడి బౌలింగ్లో వైవిధ్యం ఉంది. కీలక సమయాల్లో కచ్చితత్వంతో బంతులేస్తూ.. ప్రత్యర్థి జట్టును దెబ్బతీయగలడు. అందుకే, టీమ్ఇండియాకు అతడు గొప్ప ఆస్తి’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Delhi: పంత్ వికెట్ కీపింగ్ అదుర్స్.. ఒంటి చేత్తో సూపర్ క్యాచ్
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వికెట్ కీపింగ్తో అదరగొట్టాడు. ఇషాంత్ శర్మ వేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి వికెట్ కీపర్ పంత్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ వెనుదిరిగాడు.
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. -
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్కు శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. -
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?