IND VS PAK: అత్యుత్సాహం వల్లే భారత్‌పై పాక్‌ ఓడిపోతుంది: ఆ దేశ క్రికెటర్‌

భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటేనే అభిమానులతో పాటు ఆటగాళ్లకు సైతం ఎక్కడలేని..

Updated : 09 Aug 2022 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటేనే అభిమానులతో పాటు ఆటగాళ్లకు సైతం ఎక్కడలేని ఉత్సాహం  వస్తుంది. అయితే,  అత్యుత్సాహం వల్లే మా జట్టు భారత్‌పై ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో ఓడిపోయిందని పాక్‌ క్రికెటర్‌  షోహైబ్ మక్సూద్ అన్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో మినహా,  ఇంతకుముందు జరిగిన అన్ని ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ పై చేయి సాధించడానికి ఇదే కారణమన్నాడు. అయితే, ఈ ఇటీవల మా జట్టు వైఖరి మారింది. మా జట్టు ఇండో-పాక్ మ్యాచ్‌లను సాధారణంగా చూడటం ప్రారంభించింది. దీంతో మా ప్రదర్శనను కూడా మెరుగుపడిందని తెలిపాడు.  2021 ఆగస్టు నుంచి మక్సూద్ జాతీయజట్టుకు ఆడటం లేదు.  పాక్‌ ప్రిమియర్‌ లీగ్‌లో మాత్రం కనిపిస్తున్నాడు.  ఈ ఏడాది చివర్లో, మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి .అయితే, అంతకంటే ముందే ఈ నెల 28న ఆసియాకప్‌లో భారత్‌, పాక్‌ సమరం అభిమానులు చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని