IND vs SA : అర్ధ శతకంతో రాణించిన రాహుల్..
తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ఇండియా.. రెండో సెషన్లో కాస్త మెరుగ్గానే రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు.,,
ఇంటర్నెట్ డెస్క్ : తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ఇండియా.. రెండో సెషన్లో కాస్త మెరుగ్గానే రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు. 25 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి.. 93 పరుగులు జోడించింది. దీంతో ఈ సెషన్ ముగిసే సరికి భారత్ 146/5 స్కోరుతో నిలిచింది. రెండో సెషన్ ప్రారంభలోనే ఎంగిడి వేసిన 32వ ఓవర్లో.. హనుమ విహారి వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విహారి ఇచ్చిన సులువైన క్యాచ్ను బవుమా నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన విహారి (20).. రబాడ వేసిన 39వ ఓవర్లో వాండర్ డస్సెన్కి చిక్కి పెవిలియన్ చేరాడు. తొలి సెషన్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26), ఛెతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానె (0) ఔటైన విషయం తెలిసిందే. రిషభ్ పంత్ (13), రవిచంద్రన్ అశ్విన్ (24) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒలివర్, మార్కో జాన్సన్ చెరో రెండు వికెట్లు, కగిసో రబాడ ఒక వికెట్ తీశాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్