IND vs SL: ‘రోహిత్ ఆరంభం అదుర్స్.. ఫీల్డర్లు ఉన్న చోటుకే క్యాచ్లొచ్చాయి’
టెస్టు సారథిగా రోహిత్ శర్మకు శుభారంభం లభించిందని, అతడు కెప్టెన్గా పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురపించాడు...
రోహిత్ సారథ్యంపై గావస్కర్ ప్రశంసలు
ఇంటర్నెట్డెస్క్: టెస్టు సారథిగా రోహిత్ శర్మకు శుభారంభం లభించిందని, అతడు కెప్టెన్గా పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో గావస్కర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్ కెప్టెన్సీని మెచ్చుకొన్నాడు.
‘కెప్టెన్గా రోహిత్కు అద్భుతమైన ఆరంభం దొరికింది. ఎవరైనా మూడు రోజుల్లోనే విజయం సాధిస్తే.. ఆ జట్టు ఎంత బలమైనదో తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ టెస్టులో టీమ్ఇండియా ఫీల్డింగ్ చేసేటప్పుడు బౌలింగ్లో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి. అలాగే ఫీల్డర్లు ఉన్న చోటుకే క్యాచ్లు వచ్చాయి. దీంతో మైదానంలోని ఫీల్డర్లు ఎక్కువగా కదలాడాల్సిన అవసరం రాలేదు. సరైన ఫీల్డింగ్ సెట్చేయడమే అందుకు నిదర్శనం. బౌలింగ్లోనూ రవీంద్ర జడేజాకు కీలక సమయంలో బౌలింగ్ ఇచ్చాడు. చివరికి టీమ్ఇండియా రెండు రోజులు మిగిలుండగానే మ్యాచ్ను గెలిచింది. నేనైతే రోహిత్ కెప్టెన్సీకి 9.5/10 రేటింగ్ ఇస్తా’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
అలాగే మాజీ పేసర్ అజిత్ అగార్కర్ సైతం రోహిత్ కెప్టెన్సీపై హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో అతడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో ఏ జట్టూ పెద్దగా ఫాలోఆన్ ఆడించడం లేదని, కానీ.. రోహిత్ శ్రీలంక జట్టును ఫాలోఆన్ ఆడించాడని గుర్తుచేశాడు. దీంతో కెప్టెన్గా హిట్మ్యాన్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని పేర్కొన్నాడు. మరోవైపు మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టుల్లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించినా కొన్ని విషయాల్లో రోహిత్ మెరుగ్గా ఉన్నాడన్నాడు. రోహిత్కు జట్టు కూర్పు సరిపోయిందని, దీంతో తొలి టెస్టులో మంచి విజయం సాధించాడని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.