IND vs sl:అదరగొట్టిన అమ్మాయిలు..శ్రీలంక వైట్‌వాష్‌

శ్రీలంక పర్యటనను భారత క్రికెట్‌ మహిళా జట్టు ఘనంగా  ముగించింది. తాజాగా శ్రీలంకతో పల్లెకలే

Published : 07 Jul 2022 18:48 IST

ఇంటన్నెట్‌ డెస్క్‌: శ్రీలంక పర్యటనను భారత క్రికెట్‌ మహిళా జట్టు ఘనంగా ముగించింది. తాజాగా శ్రీలంకతో పల్లెకలే వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య జట్టుపై 39పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ ప్రీత్‌ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 88బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 2సిక్సర్లు) ,పూజా వస్త్రేకర్‌ 65 బంతుల్లో 56 నాటౌట్‌(3సిక్సర్లు) , షెపాలీ వర్మ 50 బంతుల్లో 49 (5ఫోర్లు) రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌ దిగిన శ్రీలంక 47.3 ఓవర్లలో 216 పరుగలు చేసి ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌ 3, మేఘన సింగ్‌ 2, పూజా వస్త్రేకర్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. టీమ్‌ఇండియా ఇప్పటికే టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని